Begin typing your search above and press return to search.
మహేష్.. త్రివిక్రమ్ మూవీ ఆపరేషన్ తో మరింత లేట్
By: Tupaki Desk | 4 Dec 2021 2:30 AM GMTటాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు ఈమద్య కాలంలో సర్జరీలు చేయించుకోవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఎన్టీఆర్.. బాలకృష్ణ.. చిరంజీవి లు ఇటీవలే తమకు ఉన్న సమస్యల కారణంగా సర్జరీలు చేయించుకోవడం జరిగింది. చిన్న చిన్న సమస్య మినహా అందరు హీరోలు హ్యాపీగానే ఉన్నారు.
వారంతా కూడా మళ్లీ వారి వారి వర్క్ లో జాయిన్ అయ్యారు. ఈ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సర్జరీ కి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కు సుదీర్ఘ కాలంగా మోకాలి నొప్పితో బాధ పడుతున్నాడట. ఈమద్య ఆ నొప్పి ఎక్కువ అవ్వడంతో ఆపరేషన్ తప్పనిసరి అనడంతో చేసేది లేక అందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
మహేష్ బాబు సర్జరీ చేయించుకున్న తర్వాత కనీసం రెండు నుండి మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుందట. జనవరిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ప్రారంభం అవుతుందని అనుకుంటున్న సమయంలో ఈ సర్జరీ వల్ల షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
వీరిద్దరి కాంబోలో సినిమా కోసం దశాబ్ద కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబో గురించి అధికారికంగా ప్రకటన రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలు అవుతుందా అని ఎదురు చూస్తుండగా కరోనా సెకండ్ వేవ్ మరియు ఇతరత్ర కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇప్పుడు మహేష్ బాబు సర్జరీకి వెళ్లబోతున్న నేపథ్యంలో జనవరిలో షూటింగ్ ఉండదు. ఇక సమ్మర్ లో మార్చి లేదా ఎప్పిల్ లో మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అనుకుంటూ ఉంటే మరో రెండు మూడు నెలల పాటు షూటింగ్ ఆలస్యం అవ్వబోతుండటం అభిమానులకు కాస్త అసహనం కలిగిస్తుంది.
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ కూడా పూర్తి కాకుండానే ఆపరేషన్ కు వెళ్లబోతున్నాడు. సినిమా విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కనుక మెల్లగానే షూటింగ్ ను ముగించవచ్చు అనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు సర్జరీకి సిద్దం అయ్యాడని తెలుస్తోంది. సర్కారు వారి పాట వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
వారంతా కూడా మళ్లీ వారి వారి వర్క్ లో జాయిన్ అయ్యారు. ఈ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సర్జరీ కి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కు సుదీర్ఘ కాలంగా మోకాలి నొప్పితో బాధ పడుతున్నాడట. ఈమద్య ఆ నొప్పి ఎక్కువ అవ్వడంతో ఆపరేషన్ తప్పనిసరి అనడంతో చేసేది లేక అందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
మహేష్ బాబు సర్జరీ చేయించుకున్న తర్వాత కనీసం రెండు నుండి మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుందట. జనవరిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ప్రారంభం అవుతుందని అనుకుంటున్న సమయంలో ఈ సర్జరీ వల్ల షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
వీరిద్దరి కాంబోలో సినిమా కోసం దశాబ్ద కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబో గురించి అధికారికంగా ప్రకటన రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలు అవుతుందా అని ఎదురు చూస్తుండగా కరోనా సెకండ్ వేవ్ మరియు ఇతరత్ర కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇప్పుడు మహేష్ బాబు సర్జరీకి వెళ్లబోతున్న నేపథ్యంలో జనవరిలో షూటింగ్ ఉండదు. ఇక సమ్మర్ లో మార్చి లేదా ఎప్పిల్ లో మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అనుకుంటూ ఉంటే మరో రెండు మూడు నెలల పాటు షూటింగ్ ఆలస్యం అవ్వబోతుండటం అభిమానులకు కాస్త అసహనం కలిగిస్తుంది.
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ కూడా పూర్తి కాకుండానే ఆపరేషన్ కు వెళ్లబోతున్నాడు. సినిమా విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కనుక మెల్లగానే షూటింగ్ ను ముగించవచ్చు అనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు సర్జరీకి సిద్దం అయ్యాడని తెలుస్తోంది. సర్కారు వారి పాట వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.