Begin typing your search above and press return to search.

బ్రాండ్‌ మార్చేసిన మహేష్‌.. అఖిల్‌ చేసిందే చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   3 Dec 2021 10:35 AM GMT
బ్రాండ్‌ మార్చేసిన మహేష్‌.. అఖిల్‌ చేసిందే చేస్తున్నాడు
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా చాలా తక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు.. కాని ఆయన యాడ్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. వెండి తెరపై ఆయన కనిపించేది తక్కువే అయినా బుల్లి తెరపై ఆయన యాడ్స్‌ ద్వారా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా కనిపిస్తూనే ఉంటాడు. ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు తాజాగా మౌంటెన్‌ డ్యూ ప్రచార కర్తగా ఎంపిక అయ్యాడు. ఇంతకు ముందు మహేష్‌ బాబు థమ్స్‌ అప్ కు అంబాసిడర్ గా వ్యవహరించాడు.

ఇప్పుడు కొత్తగా మౌంటెన్‌ డ్యూ కు అంబాసిడర్ గా చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫొటో షూట్‌ మరియు ఇతర విషయాలు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. మౌంటెన్‌ డ్యూ సంస్థ అధికారికంగా మహేష్‌ బాబు మా బ్రాండ్‌ అంబాసిడర్ అంటూ ప్రకటించడం జరిగింది.

మహేష్‌ బాబు సౌత్ లో మౌంటెన్‌ డ్యూ కు ప్రమోషన్ చేస్తుంటే ఉత్తరాదిన బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హృతిక్ రోషన్‌ ఈ బ్రాండ్ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబుకు ఉన్న స్టార్‌ డమ్‌ నేపథ్యంలో ఆయన ఏం పట్టినా కూడా బంగారమే అన్నట్లుగా మారిపోతుంది. ఇప్పటికే ఆయన ప్రచారం చేసిన పలు సంస్థలు కింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి పెరిగి పోయాయి.

సోషల్‌ మీడియాలో కూడా ఆ బ్రాండ్స్ కు సంబంధించిన ప్రమోషన్‌ చేస్తాడు. అందుకే ఆయన భారీ మొత్తంలో పారితోషికంను తీసుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్క బ్రాండ్‌ కు కూడా మహేష్‌ బాబు పూర్తిగా తనవంతు సహకారం అందించి సదరు బ్రాండ్‌ యొక్క సేల్స్ పెరగడం లో దోహద పడుతున్నాడు. తాజాగా మౌంటెన్‌ డ్యూ కు ప్రచార కర్తగా నియమితులు అయిన నేపథ్యంలో మహేష్‌ బాబు స్పందిస్తూ.. ‘‘ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో భయపడతారని నేను భావిస్తున్నాను. సినీ నటులు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. మనం ధైర్యంగా మరియు అజేయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.

అయితే, తనలోని భయాలను, స్వీయ సందేహాలను అధిగమించేందుకు హద్దులను సైతం వెనుక్కినెట్టేసేవాడే అసలైన హీరో. మౌంటెన్‌ డ్యూ యొక్క ఫిలాసఫీ ‘డర్‌ కే ఆగే జీత్‌ హై’ ఎప్పుడూ కూడా నన్ను బలంగా ప్రతిధ్వనిస్తుంది, ఎందుకంటే అది నా నమ్మకానికి అనుగుణంగా ఉంటుంది. అసాధారణత వైపు నన్ను నేను నెట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతుంటాను. త్వరలో మా ప్రేక్షకుల కోసం మాయాజాలం చేయడానికి మౌంటెన్‌ డ్యూతో చేతులు కలపడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను ’’ అని అన్నారు.

ఇక మహేష్‌ బాబు సినిమాల విషయానికి వస్తే పరశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ జరుగుతోంది. సినిమా చివరి దశకు వచ్చిందని అంటున్నారు. ఈనెల లేదా వచ్చే నెలలో అన్నట్లుగా సినిమా షూటింగ్‌ ముగిసే అవకాశాలు ఉన్నాయి. సినిమా చిత్రీకరణ త్వరలోనే పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా ను మహేష్ బాబు కమిట్‌ అయ్యాడు. వీరిద్దరి కాంబోలో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ రెండు సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమాను చేయబోతున్నాడు. అది ఎప్పుడు ఎలా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.