Begin typing your search above and press return to search.

'ఆ నష్టం గురించి నాకేం బెంగలేదు' అంటున్న సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   8 April 2020 3:30 PM GMT
ఆ నష్టం గురించి నాకేం బెంగలేదు అంటున్న సూపర్ స్టార్
X
ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు సినిమా ప్రొడక్షన్స్ అంటూ వ్యాపార రంగంలోకి దిగుతున్నారు సినీ స్టార్ హీరోలు. కొత్తగా నిర్మాణ సంస్థలు ప్రారంభించి ముందుచూపు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయారు. అంటే నటనతో పాటు వ్యాపారంలో బిజీ అవుతున్నారన్నమాట. ఇప్పటికే రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ రంగంలోకి దిగితే కొత్తగా మహేష్ కూడా ఎంబి ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి కొత్త వాళ్లను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదివరకే మహేష్ బాబు మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగ్గ బెస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఏఎంబి మల్టీప్లెక్స్ ఒకటి. అత్యద్భుతమైన హై లెవెల్ ప్రామాణాలతో మంచి పేరును పొందుతుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించిన ఏఎంబి సినిమాస్ ప్రారంభమై సంవత్సరం పూర్తయిందట. కరోనా కారణంగా ఈ మల్టీప్లెక్స్ భారీ నష్టాలను ఎదుర్కొంటుందట. ఎల్లప్పుడూ పబ్లిక్ తో కిటకిటలాడే థియేటర్ కరోనా దెబ్బతో వెలవెల బోతుందట. కానీ ఈ థియేటర్ నష్టం గురించి మహేష్ బాబు మాత్రం ఎలాంటి చీకుచింతా లేకుండా తాపీగా ఉన్నారట. కరోనా మూలంగా ఏఎంబి ఎదుర్కొంటున్న నష్టం గురించి నాకేం బెంగ లేదని - లాభాల గురించి ఆలోచించాల్సిన పనిలేదని సమాధానం ఇచ్చారట. కరోనా ప్రభావం పోతే ఆ తర్వాత లాభాల గురించి చూద్దాం అని చెప్పుకొస్తున్నారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.