Begin typing your search above and press return to search.
అత్యాచార ఘటనపై మహేష్ ఎమోషనల్ ట్వీట్
By: Tupaki Desk | 15 Sep 2021 6:51 AM GMTసైబాదాబ్ సింగరేణి కాలనీలో ఆరు ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరగడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పసిమొగ్గ లాంటి చిన్నారిని చిదిమేసిన నీచుడిని వెంటనే పట్టుకుని తగిన శిక్ష పడేలా చేసి చిన్నారి కుటుంబంకు న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియాలో కూడా ఈ విషయమై ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై సినీ హీరో మంచు మనోజ్ స్పందిస్తూ అతడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వంను డిమాండ్ చేశాడు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చిన్నారి అఘాయిత్యంపై సోషల్ మీడియా ద్వారా స్పందించి ఎమోషనల్ అయ్యాడు.
ట్విట్టర్ లో మహేష్ బాబు.. సమాజం ఎంతగా చెడిపోయిందో ఈ సంఘటన మనకు చూపిస్తుంది. ఆడ కూతుర్లకు రక్షణ లేకుండా పోయింది. వారికి ఎప్పుడు రక్షణ అనేది ఎప్పుడు ఒక సమాధానం లేని ప్రశ్నగానే ఉండి పోయింది. వెంటనే బాధిత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి. అత్యాచారంకు పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసి తగిన శిక్ష పడేలా చేయాలంటూ మహేష్ బాబు విజ్ఞప్తి చేశాడు. ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకోవాలని ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చిన్నారిపై అత్యాచారంకు పాల్పడ్డ వ్యక్తిని పట్టుకున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. కేటీఆర్ కూడా పట్టుకున్నారు అన్నట్లుగానే ట్వీట్ చేశారు. కాని ఇప్పటి వరకు అత్యాచారంకు పాల్పడ్డ వ్యక్తి పట్టుబడలేదు. అతడిని పట్టుకుని పట్టించిన వారికి రూ.10 లక్షల రివార్డున ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వం ఈ రివార్డు ప్రకటించిన తర్వాత అతడు పట్టుబడలేదు అంటూ తేలిపోయింది. అంతకు ముందు వరకు అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు పట్టుకుని కూడా లేడు అంటూ చెబుతున్నారు అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని పోలీసులు మాత్రం మా వద్ద అతడు లేడని బలంగా వాదిస్తూ వచ్చారు. తాజాగా పది లక్షల రివార్డును ప్రకటించి ఆచూకి కనిపెట్టాలని పేర్కొన్నారు.
ట్విట్టర్ లో మహేష్ బాబు.. సమాజం ఎంతగా చెడిపోయిందో ఈ సంఘటన మనకు చూపిస్తుంది. ఆడ కూతుర్లకు రక్షణ లేకుండా పోయింది. వారికి ఎప్పుడు రక్షణ అనేది ఎప్పుడు ఒక సమాధానం లేని ప్రశ్నగానే ఉండి పోయింది. వెంటనే బాధిత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి. అత్యాచారంకు పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసి తగిన శిక్ష పడేలా చేయాలంటూ మహేష్ బాబు విజ్ఞప్తి చేశాడు. ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకోవాలని ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చిన్నారిపై అత్యాచారంకు పాల్పడ్డ వ్యక్తిని పట్టుకున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. కేటీఆర్ కూడా పట్టుకున్నారు అన్నట్లుగానే ట్వీట్ చేశారు. కాని ఇప్పటి వరకు అత్యాచారంకు పాల్పడ్డ వ్యక్తి పట్టుబడలేదు. అతడిని పట్టుకుని పట్టించిన వారికి రూ.10 లక్షల రివార్డున ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వం ఈ రివార్డు ప్రకటించిన తర్వాత అతడు పట్టుబడలేదు అంటూ తేలిపోయింది. అంతకు ముందు వరకు అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు పట్టుకుని కూడా లేడు అంటూ చెబుతున్నారు అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని పోలీసులు మాత్రం మా వద్ద అతడు లేడని బలంగా వాదిస్తూ వచ్చారు. తాజాగా పది లక్షల రివార్డును ప్రకటించి ఆచూకి కనిపెట్టాలని పేర్కొన్నారు.