Begin typing your search above and press return to search.

మహేష్‌27 : ఆమెను రికమండ్‌ చేస్తున్న నమ్రత

By:  Tupaki Desk   |   23 Jan 2020 10:21 AM GMT
మహేష్‌27 : ఆమెను రికమండ్‌ చేస్తున్న నమ్రత
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మొన్నటి వరకు సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్‌ మరియు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపిన మహేష్‌ బాబు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా లో హాలీడే ట్రిప్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అక్కడ పిల్లలతో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూనే ఉంది. ఇక ఈ సమయంలో మహేష్‌ బాబు 27వ చిత్రంకు సంబంధించిర వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

మహేష్‌ 25వ చిత్రం మహర్షికి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం మహేష్‌ 27వ చిత్రంకు స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్న విషయం తెల్సిందే. సమ్మర్‌ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు కొత్త మూవీ ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రంకు హీరోయిన్‌ గా ఇంకా ఎవరు ఖరారు కాలేదు. కాని నమ్రత మాత్రం ఈ చిత్రం కోసం కియారా అద్వానీ ని హీరోయిన్‌ గా తీసుకోవాలంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి కి రికమండ్‌ చేసినట్లు గా సమాచారం అందుతోంది.

తన భర్తకు కియారా అద్వానీ అయితేనే సరైన జోడీ అని ఆమె భావిస్తుందట. ఎత్తు మరియు కలర్‌ ఇలా అన్ని విషయాల్లో కూడా మహేష్‌ కు కియారా మహేష్‌ కు సరైన జోడీ అంటూ ఆమె భరత్‌ అనే నేను చిత్రం సమయంలోనే చెప్పిన విషయం తెల్సిందే. భరత్‌ అనే నేను చిత్రంలో మహేష్‌ మరియు కియారాల జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే మరోసారి వీరిద్దరి కాంబోను సెట్‌ చేయాల్సిందిగా వంశీ పైడిపల్లికి నమ్రత సలహా ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. అధిష్టానం ఆర్డర్‌ వేసిన తర్వాత అధికార పక్షం అమలు చేయకుండా ఉంటుందా చెప్పండి. అందుకే ఖచ్చితం గా మహేష్‌ 27 లో కియారా అద్వానీ నటించడం కన్ఫర్మ్‌ అంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.