Begin typing your search above and press return to search.

శర్వా కెరీర్‌ లో నెం.1.. ట్రెండింగ్‌ లో నెం.1

By:  Tupaki Desk   |   24 Sep 2021 4:30 PM GMT
శర్వా కెరీర్‌ లో నెం.1.. ట్రెండింగ్‌ లో నెం.1
X
యంగ్‌ హీరో శర్వానంద్‌ కు గత కొన్నాళ్లుగా బ్యాడ్‌ టైమ్ నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలు కమర్షియల్‌ గా నిరాశ పర్చుతూ వస్తున్నాయి. కొన్ని సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా చివరకు కమర్షియల్‌ గా మాత్రం ప్లాప్ గానే నిలిచాయి అనేది ట్రెండ్‌ టాక్‌. అలాంటి శర్వానంద్‌ మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఆర్ ఎక్స్ 100 చిత్రం దర్శకుడు అజయ్ భూపతి రెండవ సినిమా గా మహాసముద్రం రూపొందడటంతో పాటు తెలుగు లో కొన్నాళ్ల క్రితం స్టార్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సిద్దార్థ్‌ ఈ సినిమాలో నటించడం వల్ల కూడా క్రేజ్ బాగా పెరిగింది. శర్వానంద్‌ మరియు సిద్దార్థ్‌ ల కాంబోలో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కాబోతున్న మహా సముద్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహా సముద్రం టైలర్ విడుదల అయిన 24 గంటల్లోనే అయిదు మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఆరు మిలియన్ ల వ్యూస్‌ తో దూసుకు పోతుంది. ఈ ట్రైలర్ వ్యూస్ సినిమాపై ఉన్న అంచనాలను తెలియజేస్తుంది. శర్వానంద్‌ కెరీర్ లో ఒక ట్రైలర్ కు ఈ రేంజ్ లో వ్యూస్‌ రావడం.. ఈ రేంజ్ లో ట్రైలర్‌ కు లైక్స్ రావడం మొదటి సారి. ఇప్పటి వరకు 175K లైక్స్‌ ను దక్కించుకుంది. స్టార్‌ హీరోల ట్రైలర్స్ కు మాత్రమే ఈ రేంజ్ లో లైక్స్ వస్తాయి. ఇంతగా వ్యూస్ ను మరియు లైక్స్ ను దక్కించుకున్న మహాసముద్రం ట్రైలర్‌ శర్వానంద్ కెరీర్ లో ప్రత్యేకమైనదిగా నిలిచింది అనడంలో సందేహం లేదు.

శర్వానంద్‌ కెరీర్‌ లో నెం.1 గా నిలిచిన మహాసముద్రం ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌ లో నెం.1 గా ట్రెండ్‌ అవుతోంది. 24 గంటలుగా ఈ ట్రైలర్‌ ట్రెండ్‌ అవ్వడంతో పాటు భారీగా లైక్స్ కూడా వస్తున్న నేపథ్యంలో శర్వానంద్‌ చాలా కాలం తర్వాత ఒక భారీ సక్సెస్ ను దక్కించుకోబోతున్నాడు అంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ ఈ సినిమా తో తన సత్తా చాటుతాడు అనే నమ్మకంను కలిగించేలా ట్రైలర్‌ ఉంది. సినిమా లో ఉన్న సిద్దార్థ్‌ మరియు ఇతర పాత్రదారులు సినిమా పై ఉన్న అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు. ఆర్‌ ఎక్స్ 100 వంటి మంచి సినిమాను అందించిన దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వం లో వస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి... అంచనాలకు తగ్గట్లుగా సినిమాను రూపొందించాడని ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ సినిమా లో హీరోయిన్ గా అదితి రావు హైదరి నటించింది. సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాత అనీల్‌ సుంకర ఈ సినిమాను నిర్మించాడు.