Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్టర్ తో హ్యాట్రిక్ మూవీ ప్లాన్ చేస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..?

By:  Tupaki Desk   |   24 Nov 2020 3:37 PM GMT
యంగ్ డైరెక్టర్ తో హ్యాట్రిక్ మూవీ ప్లాన్ చేస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..?
X
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి 'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా మారాడు. శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మెప్పించిన సుజీత్.. ఈ క్రమంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అప్పటికే 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ సుజీత్ చేతిలో పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో భారీ స్కేల్ లో 'సాహో' అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాడు. 'సాహో' తెలుగులో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా హిందీలో మాత్రం సత్తా చాటింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టడంతో సుజిత్ పేరు మారుమోగిపోయింది. అయితే యువ దర్శకుడికి అవ‌కాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావ‌డం లేదని తెలుస్తోంది.

నిజానికి సుజీత్.. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగు రీమేక్ బాధ్యతలు సుజీత్ కి అప్పగించారు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల సుజీత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో సుజీత్ తో యూవీ క్రియేషన్స్ వారు ఓ సినిమా చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సుజీత్ ని డైరెక్టర్ గా పరిచయం చేసిన యూవీ టీమ్.. వెంటనే 'సాహా' వంటి భారీ బడ్జెట్ సినిమాని కూడా అతని చేతిలో పెట్టారు. ఇదే క్రమంలో ఇప్పుడు మూడో సినిమాని మొద‌లుపెట్ట‌డానికి యూవీ టీమ్ స‌న్నాహాలు చేస్తోందని సమాచారం. మరి ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.