Begin typing your search above and press return to search.

ధ‌నుష్-ఐశ్య‌ర్య ని క‌లిపే స‌త్తా ఆ న‌టికే ఉందా?

By:  Tupaki Desk   |   20 Jan 2022 12:30 AM GMT
ధ‌నుష్-ఐశ్య‌ర్య ని క‌లిపే స‌త్తా ఆ న‌టికే ఉందా?
X
ధ‌నుష్-ఐశ్య‌ర్య విడాకుల నిర్ణ‌యంతో అభిమానులు ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గాఈ జంట క‌లిసి ఉండాల‌ని ఆశ‌ప‌డుతున్న‌ట్లు అభిప్రాయాలు వ్య‌క్తం చేసారు. ఈ నేప‌థ్యంలో నెటి జ‌నుడు ``ధ‌నుష్-ఐశ్వ‌ర్య‌ల‌తో మాట్లాడి తిరిగి వాళ్ల‌ని ఒక‌టి చేయాలంటూ`` మ‌ల‌యాళి న‌టి ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్ కి ట్వీట్ పెట్టాడు. దీంతో ఆమె ``వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితానికి భంగం క‌లిగించ‌వ‌ద్దు. కొంత మంది నెటి జ‌నులు కావాల‌నే నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నార``న్నారు. ఈ మేర‌కు స‌మంత వ్య‌వ‌హ‌రాన్ఇన ఉద‌హ‌రించారు.

చ‌ట్ట‌ప‌రంగా విడాకులు తీసుకోవ‌డానికి ముందు వేరే వాళ్ల‌తో రిలేషన్ పెట్టుకుని ప‌ర‌స్ప‌రం అనుచిత వ్యాఖ్య‌లు చేసుకోకుండా..మాన‌సిక ప్ర‌శాంత కోల్పోకుండా ఎంతో గౌర‌వంగా విడిపోయారు. కాబ‌ట్టి వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితానికి మ‌నం కూడా భంగం క‌ల్గించ‌కూడ‌దు. ద‌య‌చేసి ఇక‌నైనా వాళ్ల‌ని ఒంట‌రిగా వ‌దిలేయండి`` అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై మ‌రో నెటి జ‌న్ వాళ్ల నిర్ణ‌యాన్ని గౌర‌విస్తా. కానీ ఈ విష‌యాన్ని అధికారికంగా చెప్ప‌కుండా ఎవ‌రి స్వేచ్ఛ వారు కోరుకోవాల్సింది.

అలా చేస్తే అభిమానులు బాధ‌ప‌డే వారు కాదు క‌దా. అయినా సెల‌బ్రిటీల‌కు విడాకులు చాలా స‌ర్వ‌సాధ‌ర‌ణ‌మైపోయింది అన్నాడు. ఆ ట్వీట్ ల‌క్ష్మి ఏమ‌న్నారంటే? అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోతే ఎన్నో త‌ప్పుడు ప్ర‌చారాలు జ‌రుగుతాయి. స‌మంత ఎంతో హుందాగా విడాకుల విష‌యాన్ని వెల్ల‌డించింది. అయినా నెటి జ‌నులు ఆమెను ఎలా టార్గెట్ చేసి విమర్శించారో అంద‌రికీ తెలిసిందే. ఆమెపై ప‌నిగ‌ట్టుకుని మ‌రీ వివాదాస్ప‌ద ఆరోప‌ణ‌లు చేసారు. మొత్తానికి సెల‌బ్రిటీ క‌పుల్స్ వ‌రుస విడాకులు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. వివాహ బంధాలు వీగిపోవ‌డం చాలా స‌హ‌జంగా మారిపోయింది.