Begin typing your search above and press return to search.

ఆనాటి జ్ఞాపకం ఎంతో మధురం.. కృష్ణంరాజు ట్వీట్​ వైరల్​

By:  Tupaki Desk   |   20 Oct 2020 12:30 AM GMT
ఆనాటి జ్ఞాపకం ఎంతో మధురం..  కృష్ణంరాజు ట్వీట్​ వైరల్​
X
తెలుగు సినీరంగంలో సూపర్​స్టార్​ కృష్ణ, రెబల్​ స్టార్​ కృష్ణం రాజు ఇద్దరూ లెజెండరీ నటులే. తెలుగు సినిమా మీద వీరు తమదైన ముద్ర వేశారు. వీరిద్దరూ గొప్పనటులే కాక.. స్నేహితులు కూడా. ‘మనుషులు చేసిన దొంగలు’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమా విడుదలై నేటికి 43 ఏళ్లు .. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కృష్ణం రాజు ఓ ట్వీట్​ చేశారు. ‘మనుషులు చేసిన దొంగలు విడుదలై నేటికి 43 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం నాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. అంతేకాక సూపర్​స్టార్​ కృష్ణతో నా స్నేహాన్ని మరింత బలోపేతం చేసింది’ అంటూ కృష్ణం రాజు ట్వీట్​ చేశారు.

ఈ చిత్రానికి ఎం మల్లికార్జున రావు దర్శకత్వం వహించగా.. కృష్ణ తన సొంత నిర్మాణసంస్థ ద్వారా నిర్మించారు. కృష్ణం రాజు ట్వీట్​పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేశారని చెబుతున్నారు. ఎంతో భావోద్వేగంతో కూడిన ఈ ట్వీట్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇటీవల రాజకీయాలకు కొంత దూరమైన కృష్ణం రాజు సోషల్​మీడియాలో యాక్టివ్​ అయ్యారు. ఎప్పటికప్పుడు తన అభిమానులతో విశేషాలు పంచుకుంటున్నారు. అంతేకాక ప్రభాస్​ సినిమాల అప్​డేట్స్​ను కూడా ఫ్యాన్స్​కు చెబుతూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు. విజయనిర్మల చనిపోయాక సూపర్​స్టార్​ కృష్ణ మాత్రం ఇంటికే పరిమితమయ్యారు.