Begin typing your search above and press return to search.
ఉప్పెన హిట్ ను క్యాష్ చేసుకోవాలనుకోని క్రిష్
By: Tupaki Desk | 24 Feb 2021 6:30 AM GMTఏ హీరో మూవీ అయినా సక్సెస్ అయితే వెంటనే ఆయన నుండి మరో సినిమాను విడుదల చేస్తారు. అలా చేయడం వల్ల ముందు సినిమా తాలూకు టాక్ ఇతర విషయాలు కలిసి వచ్చి తదుపరి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. దర్శకుడు అయినా హీరోయిన్ అయినా సక్సెస్ సాధిస్తే తదుపరి సినిమా వెంటనే తీసుకు వస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది. కాని దర్శకుడు క్రిష్ మాత్రం ఈ ఫార్ములాను పాటించడం లేదు. ఆయన ఇప్పటికే పూర్తి చేసిన కొండ పొలం సినిమా ను విడుదల చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ తో క్రిష్ తెరకెక్కించిన కొండ పొలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఉప్పెన విడుదల అయిన కొన్ని వారాల్లోనే ఆ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.
ఉప్పెన కు ముందే కొండపొలం ఓటీటీలో వస్తుందేమో అనే పుకార్లు కూడా షికారు చేశాయి. అలాంటిది కొండ పొలం విషయమై ప్రస్తుతం ఎలాంటి హడావుడి లేదు. ఈ సినిమా ను మొదట ఓటీటీ రిలీజ్ అనుకున్నా కూడా ఉప్పెన సక్సెస్ మరియు థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తున్న కారణంగా సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కాని ఇప్పట్లో సినిమాను విడుదల చేయడం లేదని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ను ఆగస్టులో విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఉప్పెన మరియు కొండ పొలం పూర్తి వైవిధ్యభరిత సినిమాలు. కనుక కాస్త గ్యాప్ ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో క్రిష్ ఈ గ్యాప్ ఇచ్చి ఉంటాడు అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. అటవి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. క్రిష్ ప్రస్తుతం పవన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కొండ పొలం విడుదల పనులను క్రిష్ మొదలు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు.
ఉప్పెన కు ముందే కొండపొలం ఓటీటీలో వస్తుందేమో అనే పుకార్లు కూడా షికారు చేశాయి. అలాంటిది కొండ పొలం విషయమై ప్రస్తుతం ఎలాంటి హడావుడి లేదు. ఈ సినిమా ను మొదట ఓటీటీ రిలీజ్ అనుకున్నా కూడా ఉప్పెన సక్సెస్ మరియు థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తున్న కారణంగా సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కాని ఇప్పట్లో సినిమాను విడుదల చేయడం లేదని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ను ఆగస్టులో విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఉప్పెన మరియు కొండ పొలం పూర్తి వైవిధ్యభరిత సినిమాలు. కనుక కాస్త గ్యాప్ ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో క్రిష్ ఈ గ్యాప్ ఇచ్చి ఉంటాడు అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. అటవి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. క్రిష్ ప్రస్తుతం పవన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కొండ పొలం విడుదల పనులను క్రిష్ మొదలు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు.