Begin typing your search above and press return to search.

స్టార్లు లేరు.. ఓన్లీ కొత్త‌వాళ్లే

By:  Tupaki Desk   |   3 Dec 2015 7:16 AM GMT
స్టార్లు లేరు.. ఓన్లీ కొత్త‌వాళ్లే
X
క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ గోవిందుడు అంద‌రివాడేలే సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్ర‌స్తుతం ఓ రెండు సినిమాల విష‌యంలో సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. అందులో ఒక‌టి లేడీ ఓరియెంటెడ్ మూవీ. రుద్రాక్ష అనే టైటిల్ పెట్టుకున్నాడు. అనుష్క క‌థానాయిక‌గా దిల్‌ రాజు ఈ చిత్నాన్ని నిర్మిస్తార‌ని ఇటీవ‌లి కాలంలో ప్ర‌చార‌మైంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌ కెళుతుంది అన్న‌దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఇకపోతే ఈలోగానే కృష్ణ‌వంశీ వేరొక ప్రాజెక్టు కోసం స‌న్నాహాలు చేస్తున్నార‌ట. అప్ప‌ట్లో అంతా న‌వ‌త‌రం తార‌ల‌తో డేంజ‌ర్ అనే మూవీ తీశాడు. అదే త‌ర‌హాలో ఇప్పుడు అంతా కొత్త న‌టీన‌టుల‌తో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం దిల్‌ రాజు కృష్ణాష్ట‌మి మూవీని నిర్మిస్తున్నారు. ఇదేగాక ఇత‌ర‌త్రా స్ర్కిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్నారు. అందుకే వంశీతో సినిమా సెట్స్‌ కెళ్లేందుకు కాస్త స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఈలోగానే ఈ సినిమాని స‌ద‌రు క్రియేటివ్ డైరెక్ట‌ర్ సెట్స్‌ పైకి తీసుకెళ్ల‌నున్నాడా అంటే ఇంకా తెలియ‌రాలేదు.

ఇలా ఓ ఫేడ‌వుట్ డైరెక్ట‌ర్ కొత్త‌వాళ్లతో సినిమా తీసి హిట్టు కొట్టాల‌నుకోవ‌డం తెలివైన ఆలోచ‌నే. ఈ మూవీతో కృష్ణ‌వంశీ తిరిగి లైమ్‌ లైట్‌ లోకి వ‌చ్చినా రావ‌చ్చు. ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కున్న‌ప్పుడు క్రియేటివిటీ మొత్తం అట‌కెక్కేస్తుంద‌ని అంటారు. మ‌రోసారి మ‌రో అద్భుత అవ‌కాశ‌మిది. కొత్త‌వారితో బ్లాక్‌ బ‌స్ట‌ర్ తీసి చూపించాలి కృష్ణ‌వంశీ. ఆల్ ది బెస్ట్ టు వంశీ.