Begin typing your search above and press return to search.

నిజంగానా.. వారి పెళ్లి గురించి నాకేం తెలియదు

By:  Tupaki Desk   |   4 Dec 2021 7:44 AM GMT
నిజంగానా.. వారి పెళ్లి గురించి నాకేం తెలియదు
X
బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్ విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ లు మరో మూడు నాలుగు రోజుల్లో పెళ్లి బంధంతో ఒక్కటి అవ్వబోతున్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. పెళ్లి కోసం పెద్ద ఎత్తున బాలీవుడ్‌ ప్రముఖులు తరలి వెళ్లబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కొందరికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయట.

కొందరు తమకు ఇంకా ఆహ్వానం అందలేదు అంటున్నారు. ఇటీవలే సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కొందరు స్పందిస్తు తాము విక్కీ మరియు కేట్‌ ల పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాం. వారి పెళ్లికి వెళ్లాలని అనుకుంటున్నాం కాని ఇప్పటి వరకు మాకు ఆహ్వానం అందలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే మాట బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కియారా అద్వానీ కూడా చెప్పుకొచ్చింది.

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఆమెను కత్రీనా కైఫ్‌ మరియు విక్కీ కౌశల్‌ ల వివాహం గురించి స్పందించాల్సిందిగా కోరగా ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ నిజమా నాకు పెళ్లి గురించి ఏమీ తెలియదు. ఇప్పటి వరకు నాకు ఆహ్వానం కూడా ఏమీ అందలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

అసలు వారి పెళ్లి గురించే తనకు తెలియదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. దాంతో బాలీవుడ్‌ లో అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయని.. ఇండస్ట్రీలో ఉన్న వారు అందరిని ఈ లవ్ బర్డ్స్ ఆహ్వానించలేదు అని తెలుస్తోంది. బాలీవుడ్‌ మీడియా కథనాల ప్రకారం ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ లోని 120 నుండి 150 మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయట.

సల్మాన్‌ ఖాన్‌ తో పాటు మరో స్టార్‌ హీరో కూడా ఈ పెళ్లికి హాజరు అవ్వడం ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక పెళ్లికి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా తమ మొబైల్స్ ను వినియోగించకుండా షరతులు విధించారు. పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు మరియు వీడియోలు బయటకు రాకుండా ఈ జంట జాగ్రత్త పడుతున్నారు.

పెళ్లి తంతు కోసం మాధోపూర్‌ లోని పెళ్లి వేదిక ప్రాంతం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం 200 నుండి 300 మంది బంధు మిత్రులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ పెళ్లి చాలా చర్చనీయాంశంగా మారింది. కేట్ మరియు విక్కీల వివాహం బాలీవుడ్‌ లో మారు మ్రోగిపోతుంది. నేటి నుండి పెళ్లి ఉత్సవం షురూ అవ్వబోతుంది.