Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ని కాద‌ని చ‌ర‌ణ్ ని ఓకే చేసిన కియ‌రా?

By:  Tupaki Desk   |   2 Aug 2021 12:30 AM GMT
ఎన్టీఆర్ ని కాద‌ని చ‌ర‌ణ్ ని ఓకే చేసిన కియ‌రా?
X
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కెరీర్ ని సాగిస్తోంది కియ‌రా అద్వాణీ. మ‌రోవైపు టాలీవుడ్ లోనూ క్రేజీ ఆఫ‌ర్లు అందుకుంటోంది. ఇక్క‌డ మ‌హేష్‌.. చ‌ర‌ణ్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీకి భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

చ‌ర‌ణ్ స‌ర‌స‌న విన‌య విధేయ రామా చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాపైన త‌ర్వాత కియ‌రా పూర్తిగా బాలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. అయితే ఇంత‌లోనే కొర‌టాల శివ త‌దుప‌రి ఎన్టీఆర్ 30 కోసం క‌థానాయిక‌గా ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇంత‌లోనే ఈ సినిమా క‌రోనా క్రైసిస్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ డిలే అయ్యింది. తాజా స‌మాచారం మేర‌కు రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించేందుకు కియ‌రా సంత‌కం చేసింద‌ని తెలిసింది. శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌నున్న ఆర్.సి 15 కి కియ‌రా ఓకే చెప్పింద‌ని ఈ మూవీ కోసం ఎన్టీఆర్ 15 కి డుమ్మా కొట్టింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కియారా తన చిత్రాన్ని తిరస్కరించడంతో దర్శకుడు కొరటాల శివ మళ్లీ తార‌క్ సరసన క‌థానాయిక కోసం వెతుకుతున్నార‌ని తెలిసింది. #NTR30 .. #RC15 రెండూ సెప్టెంబర్ లో షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి. నిజానికి ఎన్టీఆర్ 30 కి కియ‌రా సంత‌కం చేయ‌లేదు. హామీ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇప్పుడు చెర్రీ 15కి సంత‌కం చేసే అవ‌కాశం వ‌చ్చింది అని తెలిసింది. ఇక శంక‌ర్ జాతీయ స్థాయిలో ఐడెంటిటీ ఉన్న ద‌ర్శ‌కుడు కావ‌డం పైగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం కావ‌డంతో కియ‌రా మ‌రో ఆలోచ‌న లేకుండా అంగీక‌రించింది. చ‌ర‌ణ్ కి మ‌గ‌ధీర- తుఫాన్ వంటి చిత్రాల‌తో బాలీవుడ్ లో గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. కియార అత‌డి స‌ర‌స‌న అంగీక‌రించ‌డానికి ఇది కూడా ఒక కార‌ణం. ఇటీవ‌ల చ‌ర‌ణ్ - కియ‌రా న‌టించిన విన‌య విధేయ రామా హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కి 20 కోట్ల డీల్ కుదిరిన సంగ‌తి తెలిసిన‌దే.