Begin typing your search above and press return to search.

ఖాన్ లు ముస్లిం న‌టీమ‌ణుల‌పై ప‌క్ష‌పాతం? కంగ‌న మ‌రో దాడి!?

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:25 AM GMT
ఖాన్ లు ముస్లిం న‌టీమ‌ణుల‌పై ప‌క్ష‌పాతం? కంగ‌న మ‌రో దాడి!?
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదాస్ప‌ద వైఖ‌రిని నిర‌సిస్తూ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిందంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ట్విట్ట‌ర్ బ్యాన్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌లే ఈ నిషేధాన్ని ఎత్తివేసిన‌ప్ప‌టి నుంచి తిరిగి ట్విట్ట‌ర్ లో డ్రాకులా ప్ర‌వేశించింది. కంగ‌న ట్విట్ట‌ర్ లోకి రీఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టినుండి గత కొన్ని రోజులుగా షారుఖ్ ఖాన్ 'పఠాన్' గురించి వ‌రుస‌ ట్వీట్ లు చేస్తోంది.

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ న‌టించిన యాక్షన్-థ్రిల్లర్ 'ప‌ఠాన్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ.. అత్యంత వేగంగా రూ.200 కోట్ల క్ల‌బ్ లో చేరిన‌ హిందీ చిత్రంగా నిలిచింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ ఫీట్ ని సాధించింది. తాజా స‌మాచారం మేర‌కు 'ప‌ఠాన్' 500 కోట్ల క్ల‌బ్ లో చేరింది.

కానీ కంగన ఇటీవల పఠాన్ బాక్సాఫీస్ విజయం గురించి త‌న‌దైన శైలిలో ప్ర‌శంసిస్తూనే చుర‌క‌లు అంటించే ప్ర‌య‌త్నం చేసింది. ప‌ఠాన్ లో ఐసిస్ ని పాకిస్తాన్ ను గొప్ప‌గా చూపించార‌ని అవ‌హేళ‌న చేసింది. తాజాగా మ‌రోసారి ట్విట్ట‌ర్ లో కంగ‌న త‌న‌దైన శైలిలో సెటైర్లు వేసింది. ''ఇది చాలా మంచి విశ్లేషణ... ఈ దేశం ఖాన్ లందరినీ మాత్రమే ప్రేమిస్తుంది. కొన్ని సార్లు ఖాన్ లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం నటీమణులపై మక్కువ ఎక్కువ‌.. కాబట్టి భారతదేశంపై ద్వేషం .. ఫాసిజం అని ఆరోపించడం చాలా అన్యాయం... భారత్ లాంటి దేశం మరొకటి లేదు యావత్ ప్రపంచంలో ??'' అని వ్యాఖ్యానించింది.

షారుఖ్ ఖాన్ 'ప‌ఠాన్' ఎందుకు బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజయవంతమైందో ఒక ట్విట్ట‌రాటీ విశ్లేషించిన తర్వాత కంగనా రనౌత్ ఇలాంటి ట్వీట్ తో ప్ర‌తిస్పందించింది. పఠాన్ రన్ ను ఆస్వాధించాలని సినిమాని రాజకీయాల్లోకి లాగవద్దని క్వీన్ గతంలో బాలీవుడ్ ను హెచ్చరించింది. హిందూ- ముస్లిములు షారుక్ ను సమానంగా ప్రేమిస్తున్నందున పఠాన్ విజయవంతమైందని కంగనా వ్యాఖ్యానించింది.

పఠాన్ గురించి ట్వీట్ చేయడం.. సినిమాను ప్రశంసిస్తుంద‌ని కొంతమంది నెటిజనులు భావించారు. కానీ కంగనా మొత్తం సినీ పరిశ్రమ అభిమానులు ఊహించ‌ని విధంగా కౌంట‌ర్లు వేసింది. అనేక లీగల్ నోటీసులతో తనను విసిగించిన వారంద‌రికీ ఇలా ట్వీట్ల‌తో చెంపదెబ్బ కొట్టింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కంగన న‌టించిన ధాక‌డ్ ఇటీవ‌ల డిజాస్ట‌ర్ ఫ‌లితంతో నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి 'తేజస్‌'లో కనిపించనుంది. భార‌త‌దేశ తొలి మ‌హిళా ప్ర‌ధాని ఇందిరాగాంధీ క‌థ‌తో 'ఎమర్జెన్సీ' అనే చిత్రంలో న‌టిస్తోంది. చంద్రముఖి 2- టికు వెడ్స్ షేరు చిత్రాల్లోను న‌టిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.