Begin typing your search above and press return to search.

మహేష్ సరసన కీర్తి ఆ పాత్రలో రొమాన్స్ చేయనుందా..?

By:  Tupaki Desk   |   6 July 2020 6:30 AM GMT
మహేష్ సరసన కీర్తి ఆ పాత్రలో రొమాన్స్ చేయనుందా..?
X
సూపర్ స్టార్ మహేష్ కోసం సర్కారు వారి టీమ్ ఏ కథానాయికను ఓకే చేస్తుందో అని ఇండస్ట్రీలో ఇంతకాలం ఆసక్తి నెలకొంది. అయితే ఇదివరకే మహేష్ తో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీని తీసుకోవాలనీ చూస్తున్నట్లు వార్తలొచ్చాయి. అందులో భాగంగా ఈ విషయం పై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే అమ్మడు ఇన్నిరోజులు ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేయాలా.. వదులుకోవాలా అనే సందిగ్ధంలో.. ఈ మూవీ చేయలేను ఎలా అని ఆలోచించి.. మరో రెండేళ్లవరకు డేట్స్ ఖాళీ లేవని చెప్పేసిందట. ఇక మహేష్ సరసన సాయిమంజ్రేకర్.. సారా అలీఖాన్ ల పేర్లు కూడా బయటికి వచ్చాయి. చివరికి వీరందరిని పక్కకు జరిపి లైన్లోకి మహానటి ఫేమ్ కీర్తిసురేష్ వచ్చింది. మహేశ్ బాబుతో 'సర్కారు వారి పాట' సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది అమ్మడు.

ఇక సర్కారు వారి పాట సినిమా కథ భారీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో సాగుతుందని.. అందులో మహేష్ బ్యాంకు మేనేజర్ గా కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. మరి ఈ బ్యాంకు మేనేజర్ ఎలాంటి అమ్మాయి ప్రేమలో పడతాడు..? అనేది మరో ఇంటరెస్టింగ్ విషయం. ఈ సినిమాలో కీర్తి.. పాత్ర గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ హ్యాండ్సమ్ బ్యాంకు మేనేజర్ అయితే.. అమ్మడు స్టైలిష్ బ్యాంకు ఉద్యోగిగా కనిపిస్తుందని కథనాలు వినిపిస్తున్నాయి. ఇక ఓ బ్యాంకు మేనేజర్ - బ్యాంకు ఎంప్లాయి మధ్య లవ్ ట్రాక్ తో పరశురామ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక మహేష్ - కీర్తిల రొమాన్స్ ఈ సినిమాలో హైలైట్ కానుందట. కీర్తి ఆల్రెడీ కావాల్సిన డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. మరి కీర్తి పాత్ర అదేనా అనే దానిపై అధికారిక ప్రకటన త్వరలో రానుందట. దీంతో త్వరలోనే ఈ పెయిర్ హిట్ పెయిర్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.