Begin typing your search above and press return to search.

మహానటికి పెళ్లి కుదిరిందా..?

By:  Tupaki Desk   |   28 Nov 2022 11:30 PM GMT
మహానటికి పెళ్లి కుదిరిందా..?
X
మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఎప్పుడూ మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. అప్పట్లో ఓ రాజకీయ నేపథ్యమున్న వ్యాపారవేత్తతో కీర్తి పెళ్ళికి రెడీ అయిందని రూమర్స్ వచ్చాయి. అలానే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ తో క్లోజ్ గా ఉండటం చూసి ఇరువురు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతున్నట్లు పుకార్లు షికారు చేశాయి.

అయితే ఇప్పుడు తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి రూమర్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోయిన్ తన తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోడానికి అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. ఆ అబ్బాయి కీర్తికి కూడా నచ్చడంతో పెళ్లి చేసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని అంటున్నారు. ఇరు కుటుంబాలు ఇప్పటికే అన్నీ మాట్లాడుకున్నారని ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు పెళ్లి తర్వాత కీర్తి నటనకు దూరంగా ఉంటుందని.. కాకపోతే నిర్మాతగా కొనసాగుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్న టైంలో కీర్తి సురేష్ అప్పుడే పెళ్లి చేసుకోవడమేంటని అభిమానులు ఆలోచిస్తున్నారు. అందులోనూ వివాహానంతరం నటనకు గుడ్ బై చెప్పడం ఏంటని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

గతంలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటున్నారంటూ వచ్చిన వార్తలన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. మరి ఈసారైనా కీర్తి నిజంగా పెళ్లి చేసుకుంటుందా? లేదా? అనే సందేహాలు ఉన్నాయి. ఎవరైనా ఏదొక సమయంలో పెళ్లి చేసుకోవాల్సిందే. మరి కీర్తి పెళ్లి ఎప్పుడు? వరుడు ఎవరు? అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఇకపోతే 'రంగ్ దే' ప్రమోషన్స్ టైములో కీర్తి తన పెళ్లి గురించి మాట్లాడింది. తనకు కాబోయే భర్తకి మానవత్వం మెండుగా ఉండాలని.. మనిషి మంచోడైతే చాలని చెప్పింది. ప్రస్తుతానికి పెళ్లాడబోయే వ్యక్తి గురించి తాను ఏమీ ఆలోచించట్లేదని.. నిజంగా పెళ్లి పీటలెక్కడానికి ఇంకా చాలా టైమ్‌ ఉందని తెలిపింది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తనకు తెలియకుండానే మూడు నాలుగు సార్లు వేరే వేరే వాళ్ళతో పెళ్లిళ్లు చేశారని నవ్వుతూ చెప్పింది.

కాగా, 'నేను శైలజ' చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన 'మహానటి' చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇందులో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆమె జాతీయ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం కీర్తి 'దసరా' అనే పాన్ ఇండియా చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలానే 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది. తమిళ్ లో 'మామన్నన్' 'సైరన్' అనే రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కీర్తి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.