Begin typing your search above and press return to search.

సల్మాన్ కోసం కష్టపడుతున్న కత్రినా.. అందుకేనా..??

By:  Tupaki Desk   |   5 March 2021 1:30 AM GMT
సల్మాన్ కోసం కష్టపడుతున్న కత్రినా.. అందుకేనా..??
X
బాలీవుడ్ లో భారీ సినిమాల సందడి మొదలైంది. స్టార్ హీరోల నుండి అప్ కమింగ్ హీరోలవరకు అందరూ తమ సినిమాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ ఇద్దరూ కలిసి నటించిన సూపర్ హిట్ టైగర్ సిరీస్ గురించి అందరికి తెలిసిందే. 2012లో విడుదలైన ఏక్ థా టైగర్.. తర్వాత 2017లో టైగర్ జిందా హై సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మేకర్స్ టైగర్3 మూవీతో తెరమీదకు రావడానికి సిద్ధం అవుతున్నారు. అలాగే ప్రధాన తారాగణంతో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసేందుకు షెడ్యూల్ రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మార్చి 8న ముంబైలో మొదటి షెడ్యూల్ ప్రారంభించనున్నారు. దీనికి ముందుగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఇద్దరూ ఈ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాల గురించి ప్రిపరేషన్ ప్రారంభించారట. ఈ ట్రైనింగ్ దాదాపు 14 రోజులపాటు సాగనుందట.

కత్రినా కైఫ్ ఇప్పటికే దక్షిణ కొరియా స్టంట్ కళాకారులతో యాక్షన్ షూట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. కత్రినా కైఫ్ కఠోరదీక్షతో సాధన తన క్యారెక్టర్ కోసం రెడీ అవుతోందట. అయితే ఈ సినిమాలో కత్రినాకు దక్షిణ కొరియా స్టంట్ మాస్టర్ ఉండగా, సల్మాన్ ఖాన్ కు దక్షిణాఫ్రికా స్టంట్ మాస్టర్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. అయితే సినిమాకోసం కత్రినా కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంటోంది. కత్రినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. ఇక టైగర్ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. మొదటి నుండి టైగర్ డైరెక్టర్స్ మారుతూ వచ్చారు. ఏక్ థా టైగర్ సినిమాను కబీర్ ఖాన్ రూపొందించగా.. రెండవ భాగానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మనీష్ శర్మ మూడో సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. చూడాలి మరి ప్రస్తుతం కత్రినా నుండి సూర్యవంశీ, ఫోన్ బూత్ సినిమాలు విడుదల దశలో ఉన్నాయి.