Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ ఖాళీ టైమ్ ని ఇలా క్యాష్ చేస్కుంటున్న భామలు!
By: Tupaki Desk | 19 April 2021 3:40 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినకు ఐదుగురు అక్కజెల్లెళ్లు ఉన్నారా? అంటే .. అవును అనే ఈ ఫోటోగ్రాఫ్ చెబుతోంది. నిజానికి కత్రినకు అసలు చెల్లెలు ఇసబెల్లా. మిగిలిన నలుగురు సిస్టర్స్ జాబితాని పరిశీలిస్తే.. రెజీనా కాసాండ్రా- నిధి అగర్వాల్ -రెబా మోనికా జాన్- మంజు వారియర్ ఉన్నారు. అయితే ఈ నలుగురితో కలిసి కత్రిన ఆభరణాల యాడ్ షూట్ లో పాల్గొంది. అంటే ప్రమోషనల్ యాడ్ కోసం సిస్టర్స్ అయ్యారన్నమాట. దానికి సంబంధించిన తెరవెనుక ఫోటోలను కత్రిన తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.
కత్రినా కైఫ్ ఇటీవల అలితాబ్ బచ్చన్ - జయ బచ్చన్ లతో కలిసి కల్యాణి జ్యువెలర్స్ అనే బ్రాండ్ కోసం ఒక టీవీ వాణిజ్య ప్రకటనలో నటించారు. ప్రకటన థీమ్ ఇంట్రెస్టింగ్. ఇందులోనే రెజీనా కాసాండ్రా- నిధి అగర్వాల్ - మంజు వారియర్ - రెబా మోనికా జాన్ ఉన్నారు.
తారలంతా సాంప్రదాయ దుస్తులు ధరించగా.. ఇందులో కత్రిన - మంజు వారియర్ ప్రత్యేక ఆభరణాల్ని ఒళ్లంతా ధరించి ఎంతో ముద్దొచ్చేస్తున్నారు. ఈ అందమైన లేడీస్ తో ఇంత అద్భుతమైన షూట్`` అని కత్రినా ఇన్ స్టాగ్రామ్ లో వ్యాఖ్యానించారు.
టీవీ కమర్షియల్ ని షేర్ చేసి,.. కొత్త సమైక్యతకు శుభప్రదమైన ఆరంభం .... బంధుమిత్రులచే ఆశీర్వదించబడిన సంప్రదాయాల ద్వారా గౌరవించబడిన బంధం. ఈ శుభ క్షణం కలిసి తీసుకువచ్చే ముహూరత్ ఇది - భారతీయ వధువు ఆదరించే ఆభరణాల సేకరణ. # ముహురత్ వెడ్డింగ్ జ్యువెలరీ`` అంటూ ప్రచారాన్ని పీక్స్ కి చేర్చారు కత్రిన. ప్రస్తుతానికి ఈ ప్రకటన ఫోటోల బంచ్ వైరల్ గా మారింది.
మరోవైపు కత్రిన ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తదుపరి టైగర్ 3 సహా పలు భారీ చిత్రాల్లో నటించాల్సి ఉండగా మహమ్మారీ వల్ల వాయిదా వేశారు. ఈ ఖాళీ సమయాన్ని కత్రిన హా ఇతర నాయికలు వాణిజ్యప్రకటనలతో సద్వినియోగం చేస్తూ ఆర్జిస్తుండడం ఆసక్తికరం.
కత్రినా కైఫ్ ఇటీవల అలితాబ్ బచ్చన్ - జయ బచ్చన్ లతో కలిసి కల్యాణి జ్యువెలర్స్ అనే బ్రాండ్ కోసం ఒక టీవీ వాణిజ్య ప్రకటనలో నటించారు. ప్రకటన థీమ్ ఇంట్రెస్టింగ్. ఇందులోనే రెజీనా కాసాండ్రా- నిధి అగర్వాల్ - మంజు వారియర్ - రెబా మోనికా జాన్ ఉన్నారు.
తారలంతా సాంప్రదాయ దుస్తులు ధరించగా.. ఇందులో కత్రిన - మంజు వారియర్ ప్రత్యేక ఆభరణాల్ని ఒళ్లంతా ధరించి ఎంతో ముద్దొచ్చేస్తున్నారు. ఈ అందమైన లేడీస్ తో ఇంత అద్భుతమైన షూట్`` అని కత్రినా ఇన్ స్టాగ్రామ్ లో వ్యాఖ్యానించారు.
టీవీ కమర్షియల్ ని షేర్ చేసి,.. కొత్త సమైక్యతకు శుభప్రదమైన ఆరంభం .... బంధుమిత్రులచే ఆశీర్వదించబడిన సంప్రదాయాల ద్వారా గౌరవించబడిన బంధం. ఈ శుభ క్షణం కలిసి తీసుకువచ్చే ముహూరత్ ఇది - భారతీయ వధువు ఆదరించే ఆభరణాల సేకరణ. # ముహురత్ వెడ్డింగ్ జ్యువెలరీ`` అంటూ ప్రచారాన్ని పీక్స్ కి చేర్చారు కత్రిన. ప్రస్తుతానికి ఈ ప్రకటన ఫోటోల బంచ్ వైరల్ గా మారింది.
మరోవైపు కత్రిన ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తదుపరి టైగర్ 3 సహా పలు భారీ చిత్రాల్లో నటించాల్సి ఉండగా మహమ్మారీ వల్ల వాయిదా వేశారు. ఈ ఖాళీ సమయాన్ని కత్రిన హా ఇతర నాయికలు వాణిజ్యప్రకటనలతో సద్వినియోగం చేస్తూ ఆర్జిస్తుండడం ఆసక్తికరం.