Begin typing your search above and press return to search.

కపిల్ బయోపిక్​ ఓటీటీలోనే.. అభిమానులకు పండగే!

By:  Tupaki Desk   |   21 Sep 2020 6:00 AM GMT
కపిల్ బయోపిక్​ ఓటీటీలోనే.. అభిమానులకు పండగే!
X
లెజెండరీ క్రికెటర్​, ఇండియాకు తొలి వరల్ట్​ కప్​ తీసుకొచ్చిన కపిల్​దేవ్​ జీవితం ఆధారంగా బాలీవుడ్​లో ఓ భారీ బయోపిక్​ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రణ్​వీర్​ సింగ్​ కపిల్​దేవ్​ గా కనిపించబోతుండగా... కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్, పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​ కూడా పూర్తయ్యింది. అయితే గత మార్చిలోనే చిత్రం రిలీజ్​ కావాల్సి ఉండగా.. లాక్​ డౌన్​ దెబ్బ తో బ్రేక్​ పడింది. భారీ బడ్జెట్​ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత పాన్​ఇండియా మూవీగా దేశ వ్యాప్తంగా థియేటర్ల లోనే రిలీజ్​ చేయాలనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీ లో విడుదల చేయబోతున్నట్టు కొంత కాలంగా రూమర్స్​ వినిపిస్తున్నాయి. కాగా ఎట్టకేలకు ఆ రూమర్స్ నిజమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ ఫామ్​ అమెజాన్​ ఈ చిత్రాన్ని అన్నిభాషల్లో రిలీజ్​ చేసేందుకు భారీ ఆఫర్ ​తో ముందుకొచ్చిందట. ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గే సూచనలు కనిపించక పోవడం తో.. ఓటీటీ లో విడుదలకే చిత్ర నిర్మాతలు మొగ్గు చూపుతున్నారని ముంబై సినీవర్గాల టాక్​. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కబీర్​ఖాన్ ఎంతో ప్రతిష్ఠాత్మకం గా తెరకెక్కించారు. 80ల నాటి కథ కావడం తో దర్శకుడు ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. ఓటీటీ లో రిలీజ్​ చేస్తే ప్రేక్షకులు ఆ థ్రిల్ మిస్సవుతారన్న కారణం తో ఇంత కాలం రిలీజ్ ​ను ఆపారు. అయితే కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.