Begin typing your search above and press return to search.
50ఏళ్లకు అత్యంత ధనవంతురాలినవుతా: స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 29 May 2020 11:50 AM GMTఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రౌనత్ తాజాగా తాజాగా ముంబైలో ఏకంగా రూ.48 కోట్లు పెట్టి ఓ ఖరీదైన ఆఫీసును ఓపెన్ చేసింది. ముంబైలోని పాలిహిల్స్ లో ఇంత భారీ పెట్టుబడి పెట్టుబడి పెట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా తన కెరీర్ లోని గెలుపోటముల గురించి కంగనా వివరించింది.
కంగనా మాట్లాడుతూ.. చేతిలో కేవలం రూ.1500 పట్టుకొని ఇంటి నుంచి పారిపోయానని.. ఎన్నో పోరాటాల అనంతరం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగానని తెలిపింది. ఇన్నేళ్లలో ఎన్నో కష్టాలు, నష్టాలు తన మనసుపై కెరీర్ పై చాలా ప్రభావం చూపాయని తెలిపింది. ఇంతవరకు ఎదుగుతానని అనుకోలేదని కంగన వివరించింది. తనకు పెద్ద ఆలోచనలు కూడా లేవని పేర్కొంది.
పురుషాధిక్య సమాజంలో ఒక ఆడదానిగా డబ్బు సంపాదనపై దృష్టిపెట్టడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని కంగన ఆరోపించింది. కానీ అదే తన జీవిత గమనాన్ని మార్చిందని.. తన ఆలోచనా విధానం కూడా మారిపోయిందని తెలిపింది.
డబ్బు సంపాదనే లక్ష్యంగా తాను ఊరు నుంచి వచ్చానని.. తనను ఎన్ని మాటలన్నీ కసిని పెంచాయని.. 50 ఏళ్లు వచ్చేసరికి దేశంలో అత్యంత ధనవంతురాలిగా నిలబడడమే తన ప్రస్తుత లక్ష్యమని కంగనా రౌనత్ తెలిపింది.
కంగనా మాట్లాడుతూ.. చేతిలో కేవలం రూ.1500 పట్టుకొని ఇంటి నుంచి పారిపోయానని.. ఎన్నో పోరాటాల అనంతరం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగానని తెలిపింది. ఇన్నేళ్లలో ఎన్నో కష్టాలు, నష్టాలు తన మనసుపై కెరీర్ పై చాలా ప్రభావం చూపాయని తెలిపింది. ఇంతవరకు ఎదుగుతానని అనుకోలేదని కంగన వివరించింది. తనకు పెద్ద ఆలోచనలు కూడా లేవని పేర్కొంది.
పురుషాధిక్య సమాజంలో ఒక ఆడదానిగా డబ్బు సంపాదనపై దృష్టిపెట్టడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని కంగన ఆరోపించింది. కానీ అదే తన జీవిత గమనాన్ని మార్చిందని.. తన ఆలోచనా విధానం కూడా మారిపోయిందని తెలిపింది.
డబ్బు సంపాదనే లక్ష్యంగా తాను ఊరు నుంచి వచ్చానని.. తనను ఎన్ని మాటలన్నీ కసిని పెంచాయని.. 50 ఏళ్లు వచ్చేసరికి దేశంలో అత్యంత ధనవంతురాలిగా నిలబడడమే తన ప్రస్తుత లక్ష్యమని కంగనా రౌనత్ తెలిపింది.