Begin typing your search above and press return to search.

చంద్రముఖి 2 గురించి స్పెషల్ అప్ డేట్ ఇచ్చిన కంగనా

By:  Tupaki Desk   |   30 Jan 2023 4:00 PM GMT
చంద్రముఖి 2 గురించి స్పెషల్ అప్ డేట్ ఇచ్చిన కంగనా
X
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తమిళ నాట మరో క్రేజీ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే తలైవి సినిమాలో నటించి మెప్పించిన ఈమె.. తాజాగా పి. వాసు తెరకెక్కిస్తున్న చంద్రముఖి 2 లో టైటిల్ రోల్ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ నెల మొదటి వారంలో ప్రారంభం అయిన షూటింగ్ లో ఇప్పటికే కంగనా కూడా పాల్గొంటుంది. అయితే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇటీవలే ఎమర్జెన్సీ షూటింగ్ ను పూర్తి చేసిన కంగనా రనౌత్ ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా చంద్రముఖి 2 రిహార్సల్స్ మొదలు పెట్టింది. తలైవి తర్వాత తమిళంలో కంగనా రనౌత్ నటిస్తున్న సినిమా ఇది. ఈ క్రమంలోనే కంగనా తన సామాజిక మాధ్యమాల అకౌంట్ ద్వారా సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం కాలా మాస్టర్ జీతో పాటు సినిమా క్లైమాక్స్ పాట కోసం రిహార్సల్ చేస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ పాటను గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత కీరవాణి స్వరపరిచారని వివరించింది క్వీన్ కంగనా. అందులో తాను నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.

చంద్రముఖిలోని వారాయ్ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కంగనా నుంచి మళ్లీ అదే మ్యాజిక్‌ ని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. రాజు గారి ఆస్థానంలో ప్రముఖ నర్తకి పాత్రలో కంగనా అలరించనుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో రజినీ కాంత్, నయనతార తమ పర్ఫార్మెన్స్ తో మాయ చేయగా.. చంద్రముఖి పాత్రలో జ్యోతిక ఇరగదీసిందనే చెప్పాలి. అయితే చంద్రముఖి 2 కూడా జ్యోతిక తోనే తీస్తారని అంతా అనుకున్నారు.

కానీ కంగనకు ఉన్న పాన్ ఇండియా స్టార్ గుర్తింపు సినిమాకు ప్లస్ అవుతుందని కంగనను తీసుకున్నట్లు సమాచారం. చంద్రముఖి 2 సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. పి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ తో నిర్మిస్తోంది.

అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా చేస్తోంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తూనే స్వీయ దర్శక, నిర్మాణంలో ఈ సినిమాను రూపొందిస్తోంది. ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో నటించనుంది. ఇండియాలో 1975 సమయంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.