Begin typing your search above and press return to search.

లిరిసిస్ట్ జావేద్ తో వివాదంలో బొంబాయి హైకోర్టుకు కంగ‌న‌!

By:  Tupaki Desk   |   22 July 2021 12:30 AM GMT
లిరిసిస్ట్ జావేద్ తో వివాదంలో బొంబాయి హైకోర్టుకు కంగ‌న‌!
X
ప్ర‌ఖ్యాత లిరిసిస్ట్ జావేద్ అక్త‌ర్ తో కంగ‌న వివాదం కోర్టుల ప‌రిధిలో న‌లుగుతున్న సంగ‌తి తెలిసిన‌దే. తనపై అంధేరిలోని 10వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రారంభించిన మొత్తం చర్యలను రద్దు చేయాలని కోరుతూ తాజాగా కంగనా రనౌత్ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది భారతీయ శిక్షాస్మృతిలోని 499 మ‌రియు 500 సెక్షన్ల క్రింద జావేద్ స‌మ‌ర్పించిన‌ ఫిర్యాదుకు పూర్తి కౌంట‌ర్ పిటిష‌న్.

కంగనా ఈ కేసును మేజిస్ట్రేట్ ప్రారంభించినట్లు తెలిపారు. ``న్యాయపరమైన ప‌రిశోధ‌న‌ లేకుండా ప్రమాణంపై ఫిర్యాదులో పేర్కొన్న సాక్షులను విచారించడంలో విఫలమైనందున సెక్షన్ 200 ప్రకారం,.. సిఆర్పిసి సెక్షన్ 202 (2) ప్ర‌కారం.. సిఆర్పిసి సెక్షన్ 162 లోని నిబంధనలను ఉల్లంఘించారు. పోలీసులు సేకరించిన అదే సాక్షి-స్టేట్మెంట్లపై మ‌రోసారి ఆధారపడటానికి ప్రయత్నించారు. వారి సంత‌కాల‌నే సేక‌రించారు`` అని వాద‌న‌ను వినిపించారు.

ఇంతకుముందు జావేద్ అక్తర్ .. కంగ‌న పాస్ పోర్ట్ ఎపిసోడ్ పై బొంబాయి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తప్పుడు క‌థ‌లు వినిపిస్తోంద‌ని కంగ‌న‌పై బాలీవుడ్ గేయ రచయిత ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చిలో కంగనా రనౌత్ ను పిలిచినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యంది.

కంగనా న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ కోర్టు ముందు ఎత్తిచూపారు. తరువాత దిందోషి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో కంగనా అభ్యర్ధనను సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఈ కారణంగానే కంగనా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది.

పోలీసుల చర్య‌ల‌తో సాక్షులను సులభంగా ప్రభావితం చేయవచ్చని ఈ కారణంగా కోర్టులో ప్రమాణ స్వీకారం కింద భౌతిక సాక్షుల సాక్ష్యాలను రికార్డ్ చేయడం.. ఫిర్యాదుదారుడు జావేద్ అక్తర్ చేత ప్రత్యక్షంగా లేదా వాస్తవంగా ఏదైనా కేసు న‌మోదు చేయబడిందా? అనేది నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది. అటువంటిది అనుమతిస్తే ఇతర న్యాయాధికారులకు తప్పుడు ఉదాహరణగా నిలుస్తుందని కంగనా త‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఎందుకంటే ఇది చాలా కేసులలో నిందితుల హక్కులు స్వేచ్ఛను కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు.

జావేద్ అక్తర్ తరపు న్యాయవాది జే.భరద్వాజ్ హాజరుకానున్నారు. ఈ విషయం వచ్చే వారం జస్టిస్ ఎస్.ఎస్.షిండే,.. జస్టిస్ ఎన్‌.జె జమదార్ ధర్మాసనం ముందు విచారణకు వెల్లే జాబితాలో ఉండే అవకాశం ఉంది.

కంగనా రనౌత్ పై ఒక వార్తా ఛానెల్ లో ఆమె ఇంటర్వ్యూ విన్న తర్వాత జావేద్ అక్తర్ తనపై ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 2021 లో మేజిస్ట్రేట్ రనౌత్ కు నోటీసు ఇచ్చారు. అయితే రనౌత్ కోర్టుకు హాజరుకాలేదు. మార్చిలో బెయిల్ వారెంట్ జారీ చేయబడింది. వారెంట్ రద్దు చేయటానికి రనౌత్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ధాక‌డ్ చిత్రీక‌ర‌ణ కోసం విదేశాల‌కు వెళ్లాల్సి ఉండగా కంగ‌నకు పాస్ పోర్ట్ రెన్యువ‌ల్ ప‌రంగా చిక్కులు ఏర్ప‌డ‌గా తాను కోర్టును ఆశ్ర‌యించి పోరాడిన సంగ‌తి విధిత‌మే.