Begin typing your search above and press return to search.

కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న సెలబ్రిటీ కపుల్..!

By:  Tupaki Desk   |   7 May 2021 1:30 PM GMT
కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న సెలబ్రిటీ కపుల్..!
X
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. కరోనా లాక్డౌన్ సమయం నుండి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రస్తుతం ఇండియాలో తీవ్రమైన పరిస్థితికి దారితీసింది. ఏ రేంజిలో అంటే రోజురోజుకి లక్షల్లో జనాలు కరోనా బాధితులుగా మారుతుండగా.. వేలల్లో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే పలు రాష్ట్రలలో ప్రభుత్వాలు కర్ఫ్యు - లాక్డౌన్ లాంటివి విధించే సరికి సామాన్యులు బయటికి వెళ్లలేని పరిస్థితితో పాటు పనులు లేక పస్తులు ఉండాల్సిన దారుణ పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయి. ప్రతిరోజూ వార్తలలో చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది సెలబ్రిటీలు కరోనా పై అవగాహనా కల్పిస్తున్నారు అని.

వారిలో కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడే మనలోని మానవత్వం బయటికి వస్తుంది అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులకు జాగ్రత్తలు సూచిస్తూనే ఉంది. అయితే తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ తో కలిసి కోవిడ్ ఫస్ట్ డోస్ వాక్సిన్ తీసుకున్నట్లుగా తెలిపింది. అలాగే వాక్సిన్ తీసుకున్న వెంటనే సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్ట్ చేసింది. వాక్సినేటెడ్ సక్సెస్ అంటూ కాజల్ - గౌతమ్ ఇద్దరూ కూడా మాస్కులు ధరించి హ్యాపీ ఫేసెస్ తో ఫోటోకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ దంపతుల పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ తో హే సినామిక అనే సినిమాలో కనిపించనుంది. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. కరోనా పరిస్థితి తొలిగిపోతే కాజల్ సినిమాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.