Begin typing your search above and press return to search.

ఎమ్మార్వో ఆఫీస్‌ లో ఎన్టీఆర్‌.. అభిమానుల కోలాహలం

By:  Tupaki Desk   |   31 July 2021 3:39 AM GMT
ఎమ్మార్వో ఆఫీస్‌ లో ఎన్టీఆర్‌.. అభిమానుల కోలాహలం
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీర్‌ రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రత్యక్షం అయ్యారు. అక్కడ ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఎన్టీఆర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం స్వయంగా ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లారు. తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు గాను ఎన్టీఆర్‌ ఎమ్మార్వో ఆఫీస్‌ కు వెళ్లి సంతకాలు పెట్టి.. ఫొటోలు దిగారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ తో ఎమ్మార్వో సహా అక్కడ ఆఫీస్ అధికారులు ఇతర సిబ్బంది ఎన్టీఆర్‌ తో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారందరితో కూడా ఎన్టీఆర్‌ ఫొటోలు దిగి వారితో కొన్ని నిమిషాలు మాట్లాడారు. ఎమ్మార్వో ఆఫీస్ అధికారులతో మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున స్థానిక అభిమానులు కూడా అక్కడకు చేరుకోవడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది.

రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం కోసం ఎన్టీఆర్‌ వస్తున్నారనే సమాచారం కొద్ది సమయం ముందు తెలియడంతో ఒక్కసారిగా అందరికి విషయం తెల్సి పోయింది. దాంతో పెద్ద ఎత్తున జనాలు అక్కడకు క్యూ కట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని అభిమానులను కాస్త కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కొందరితో సెల్ఫీలు తీసుకున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లి పోయారు. మొత్తానికి తమ ప్రాంతంకు ఎన్టీఆర్‌ వచ్చిన నేపథ్యంలో స్థానిక అభిమానులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నట్లుగా ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది.

ఎన్టీఆర్ ఆర్ ఆర్‌ ఆర్‌ చివరి షెడ్యూల్‌ కు సిద్దం అవుతున్నాడు. మరో వైపు జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. అతి త్వరలోనే ఎన్టీఆర్‌ జెమిని టీవీలో కనిపించబోతున్నారు. త్వరలోనే షో ను టెలికాస్ట్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్‌ షూటింగ్ ను వారం నుండి రెండు వారాల్లో ముగించేయనున్నారట. ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌ బిజీ బిజీగా ఉన్నా కూడా తాను కొన్న భూమి రిజిస్ట్రేషన్‌ కోసం స్వయంగా శంకర్‌ పల్లి వెళ్లారు.