Begin typing your search above and press return to search.

దిమ్మతిరిగిపోయే 'రీమేక్'లో స్టార్ హీరోలు!

By:  Tupaki Desk   |   26 May 2020 1:30 PM GMT
దిమ్మతిరిగిపోయే రీమేక్లో స్టార్ హీరోలు!
X
అయ్యపనుమ్ కోషియమ్. మలయాళంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఈ సినిమాలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ నటించారు. ఇందులో వీరిద్దరి పాత్రలు హైలైట్. పృథ్వీరాజ్, బీజూ నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. మలయాళంలో ఇటీవల అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో అయ్యపనుమ్ కోషియమ్ ముందు నిలుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా.. అన్నీ బాషల సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సౌత్ నార్త్ భాషల్లోని స్టార్ హీరోలందరూ రీమేక్ రైట్స్‌ కోసం పోటీలు పడుతున్నారు.

అయ్యపనుమ్ కోషియమ్ సినిమా హక్కుల కోసం బాలీవుడ్ నుంచి భారీగా ఎగబడ్డారు. చివరికి హిందీ రీమేక్ రైట్స్‌ను హీరో జాన్ అబ్రహం దక్కించుకున్నాడు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ జేఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జాన్ అబ్రహం ట్వీట్ ద్వారా ప్రకటించాడు. ఈ బ్యానర్‌పై ఇదివరకే ఆయుష్మాన్ ఖురానాతో విక్కీ డోనర్, ఆ తర్వాత మద్రాస్ కేఫే, రాకీ హ్యాండ్సమ్, ఫోర్స్ 2, పరమాణు: ది స్టోరి ఆఫ్ పోఖ్రాన్, బాట్లాహౌస్ లాంటి చిత్రాలను నిర్మించి విజయాలను అందుకున్నారు. జాన్ అబ్రహం ట్వీట్ చేస్తూ.. యాక్షన్, థ్రిల్, చక్కటి కథ లాంటి అంశాలతో పొందికగా రూపొందింది. అలాంటి ఫీల్‌ గుడ్ స్టోరీని తెరకెక్కించాలనే ఉద్దేశంతో జేఏ ఎంటర్‌టైన్‌మెంట్ హిందీ హక్కులను సొంతం చేసుకుంది.

హిందీలో అంతే మొత్తంలో చక్కటి ఎంగేజ్‌మెంట్‌తో సినిమాను తెరకెక్కిస్తాం. ఈ సినిమా చేయబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది'' అని చెప్పాడు. ఇక మలయాళంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా పాపులర్ అయిన అయ్యపనుమ్ కోషియమ్ సినిమాను స్టార్ హీరో సూర్య చేయబోతున్నాడట. ఈ సినిమా కోసం తమ్ముడు కార్తీతో కలిసి తొలిసారి నటించనున్నాడట. ఈ వార్త తమిళ సినీ వర్గాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొల్పింది. ఇక ఈ సూపర్ హిట్ అయ్యపనుమ్ కోషియమ్ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ సృష్టిస్తుంది. ఈ వార్త తెలిసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.