Begin typing your search above and press return to search.

టైమ్ విలువ ఇప్పుడే తెలిసింది.. అంటున్న స్టార్ కిడ్

By:  Tupaki Desk   |   2 April 2020 12:30 AM GMT
టైమ్ విలువ ఇప్పుడే తెలిసింది.. అంటున్న స్టార్ కిడ్
X
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటోంది. ఇంట్లో ఉంటే ఎన్నో జ్ఞాపకాలు పురివిప్పుతున్నాయి అంటోంది జాన్వీ బ్యూటీ. ఖాళీగా ఉంటే తల్లి శ్రీదేవి కూడా గుర్తొస్తుందట. స్వీయ నిర్బంధంలో ఉన్న జాన్వీ తన మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అందులో తల్లి శ్రీదేవి పాత్ర ఎంతో ఉంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన రోజువారీ లైఫ్ లో జరిగే అనుభవాలను, ఆలోచనలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది.

కరోనావైరస్ కారణంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌లో భాగంగా జీవితంలో చాలా విషయాలు అర్థం చేసుకుందట. తినే ఆహారంతో పాటు ఇంట్లో వస్తువుల విలువ కూడా తెలుసుకుంటుందట.

ఇంట్లో నిత్యావసర వస్తువులు అయిపోతే పేదవాళ్ళు ఎంత కష్టపడతారో.. వారు తమ ప్రాణాలను కూడా రిస్క్‌ లో పెడుతారు. నాకు ఆ అవసరం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పెరిగాను. ఆహారం విషయంలో నేను బాధ్యతారాహిత్యంగా ఉన్నానని తెలుస్తుంది. ఈ వారం రోజుల్లో ఇంట్లోకి ఏమేమి అవసరం అవుతాయో తెలుసుకున్నాను అంటుంది జాన్వీ. ఇంట్లోని ప్రతీ ఒక్కరి గురించి పట్టించుకోవాలనే ధ్యాస కలిగింది. ఇకనుండి తండ్రి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలని నిర్ణయించుకుందట. టైం విలువను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఇంట్లో ఉంటే తల్లి శ్రీదేవి గుర్తొచ్చి భావోద్వేగానికి గురయ్యింది జాన్వీ. తల్లి కూడా ఇంకా ఉందని, ఆమె తన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉందని అన్పిస్తుందట.