Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ః సహజ నటి షాకింగ్ లుక్
By: Tupaki Desk | 1 March 2021 3:30 AM GMT1970 నుండి తెలుగు వెండి తెరపై తనదైన ముద్రను వేసి సహజ నటిగా పేరు దక్కించుకున్న జయసుధ హీరోయిన్ గానే కాకుండా అనేక రకాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల కొద్ది సినిమాలు చేసిన జయసుధ దాదాపు టాప్ స్టార్ హీరోలందరికి కూడా అమ్మగా కనిపించారు. అలాంటి జయసుధ గత ఏడాది కాలంగా పెద్దగా కనిపించడం లేదు. సినిమాల్లో ఆమె నటించక పోవడంతో పాటు మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆమె ఒక సీరియల్ ప్రమోషన్ కోసం వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో జయసుధ లుక్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు.
ఆమె హెయిర్ స్టైల్ తో పాటు గతంతో పోల్చితే ఆమె చాలా సన్నగా అయ్యారు. ఆమె మొహంలో కూడా కళ కనిపించడం లేదు. జీవం లేకుండా ఉన్నట్లుగా అనిపించారు. ఆమె అభిమానులు వీడియోలో చూసి అసలేం జరిగింది అంటూ ఆరా తీస్తున్నారు. జయసుధ గారు అనారోగ్య సమస్యలను ఏమైనా ఎదుర్కొంటున్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సహజ నటి కాస్త ఇలా అయ్యారేంటి.. ముందు ముందు ఆమెను వెండి తెరపై చూడలేమా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయసుధ మళ్లీ మునుపటి ఉత్సాహంతో సినిమాలు చేయాలని ఆమె ఆరోగ్యంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు.
జయసుధ చాలా ఏళ్ల క్రితం శోభన్ బాబుతో కలిసి చేసిన జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడూ.. అంటూ సాగే పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాట పల్లవి టైటిల్ గా సీరియల్ రాబోతుంది. జానకి కలగనలేదు సీరియల్ ప్రమోషన్ లో భాగంగా జయసుధ చాలా కాలం తర్వాత కనిపించారు. అప్పట్లో ఆ పాట ఊటీలో చేశాం. ఇళయరాజా గారు సంగీతం అందించారు. ఇప్పుడు ఆ సాంగ్ పేరుతో సీరియల్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సీరియల్ యూనిట్ సభ్యులు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.
ఆమె హెయిర్ స్టైల్ తో పాటు గతంతో పోల్చితే ఆమె చాలా సన్నగా అయ్యారు. ఆమె మొహంలో కూడా కళ కనిపించడం లేదు. జీవం లేకుండా ఉన్నట్లుగా అనిపించారు. ఆమె అభిమానులు వీడియోలో చూసి అసలేం జరిగింది అంటూ ఆరా తీస్తున్నారు. జయసుధ గారు అనారోగ్య సమస్యలను ఏమైనా ఎదుర్కొంటున్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సహజ నటి కాస్త ఇలా అయ్యారేంటి.. ముందు ముందు ఆమెను వెండి తెరపై చూడలేమా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయసుధ మళ్లీ మునుపటి ఉత్సాహంతో సినిమాలు చేయాలని ఆమె ఆరోగ్యంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు.
జయసుధ చాలా ఏళ్ల క్రితం శోభన్ బాబుతో కలిసి చేసిన జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడూ.. అంటూ సాగే పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాట పల్లవి టైటిల్ గా సీరియల్ రాబోతుంది. జానకి కలగనలేదు సీరియల్ ప్రమోషన్ లో భాగంగా జయసుధ చాలా కాలం తర్వాత కనిపించారు. అప్పట్లో ఆ పాట ఊటీలో చేశాం. ఇళయరాజా గారు సంగీతం అందించారు. ఇప్పుడు ఆ సాంగ్ పేరుతో సీరియల్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సీరియల్ యూనిట్ సభ్యులు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.