Begin typing your search above and press return to search.

జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇప్ప‌ట్లో లేన‌ట్టే?

By:  Tupaki Desk   |   5 Oct 2022 12:30 AM GMT
జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇప్ప‌ట్లో లేన‌ట్టే?
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తుంద‌ని అంతా భావించారు. ఇప్ప‌టికే ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న జూ.అతిలోక సుంద‌రి జాన్వీని ఒప్పించేందుకు స్టార్ డైరెక్ట‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్త‌ల‌ను జాన్వీ క‌పూర్ ఇంత‌కుముందు ఖండించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశం వ‌స్తే న‌టించేందుకు తాను సిద్ధ‌మేన‌ని తెలిపింది. అయితే ఇటీవ‌లి కాలంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టింపజేసేందుకు కొర‌టాల శివ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

అయితే జాన్వీని సంప్ర‌దించారా లేదా? జాన్వీ ఓకే చెప్పిందా లేదా? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ లేదు. ఇంత‌లోనే ఎన్టీఆర్ స‌ర‌స‌న కియ‌రా అద్వాణీ న‌టిస్తుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ దీనికి కూడా అధికారిక ధృవీక‌ర‌ణ లేదు. ఇంత‌లోనే జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో త‌న లైన‌ప్ ని మ‌రింత బ‌లంగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

తాజా స‌మాచారం మేర‌కు జాన్వీ క‌పూర్ మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ కి సంత‌కం చేసింది. `బడే మియాన్ చోటే మియాన్‌`లో అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్‌లతో క‌లిసి జాన్వీ కపూర్ న‌టించ‌నుంది. ఈ మూవీ జనవరి 2023లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. బడే మియాన్ చోటే మియాన్ ఇటీవ‌లే ప్రారంభమైంది. అప్పటి నుండి ద‌ర్శ‌క‌నిర్మాతలు ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ లు ఇస్తూనే ఉన్నారు. గత నెలలో మేకర్స్ అక్ష‌య్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సినిమా సెట్స్ నుండి ఇద్దరు ప్రధాన తారల తో లుక్ ని విడుదల చేశారు. ఇప్పుడు మేకర్స్ క‌థానాయిక‌గా జాన్వీని లాక్ చేసినట్లు క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

బడే మియాన్ చోటే మియాన్ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించ‌నున్నారు. వాషు భ‌గ్నానీ- జాకీ భగ్నాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ యాక్షన్-ఎంటర్‌టైనర్ ని స్కాట్లాండ్- ఆల్ప్స్- UK -సౌదీలో చిత్రీకరించనున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... జాన్వీ న‌టించిన సినిమాలు త‌దుప‌రి విడుద‌ల క్యూలో ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌పూర్ గాళ్ ఇటీవల `గుడ్ లక్ జెర్రీ`లో నటించింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కించుకుంది. త‌దుప‌రి `మిలీ` విడుద‌ల‌కు రానుంది. `మిస్టర్ అండ్ మిసెస్ మహి` లోను న‌టిస్తోంది.

అలాగే జూనియ‌ర్ భాయ్ గా పాపుల‌రైన‌ వరుణ్ ధావన్ `బవాల్` లోను నటిస్తోంది. తార‌క్ స‌ర‌స‌న టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందా లేదా? అన్న‌ది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం జాన్వీ షెడ్యూల్స్ చూస్తుంటే ఇప్ప‌ట్లో టాలీవుడ్ ఎంట్రీ లేన‌ట్టేన‌ని అంతా ఊహిస్తున్నారు. జాన్వీ తాజా క‌మిట్ మెంట్ అనంత‌రం.. ఎన్టీఆర్- కొర‌టాల సినిమాకి కాల్షీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.