Begin typing your search above and press return to search.

జిమ్ నుంచి బ‌య‌ట‌కు వస్తూనే చెమటలెక్కించిన జానూ!

By:  Tupaki Desk   |   1 Aug 2021 5:04 AM GMT
జిమ్ నుంచి బ‌య‌ట‌కు వస్తూనే చెమటలెక్కించిన జానూ!
X
బాలీవుడ్ లో ట్యాలెంటెడ్ న‌ట‌వార‌సురాలిగా జాన్వీ పేరు మార్మోగుతోంది. ఫిట్నెస్ ఫ్రీక్ గా ఫ్యాష‌నిస్టాగా త‌న‌కంటూ ఇమేజ్ క్రియేటైంది. ఓవైపు వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంటూనే.. స్టైల్ కంటెంట్ ని స్ప్రెడ్ చేయ‌డం ద్వారా సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ని జాన్వీ పెంచుకుంది.

షోబిజ్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి జాన్వి కపూర్ ప్రధాన ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్దేశిస్తోంది. యువ నటి జిమ్ లో రెగ్యులర్ గా ఉంటుంది. పైలేట్స్ వర్కౌట్ సెషన్ లను ఎప్పుడూ మిస్ చేయ‌దు. తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. తన ఇన్ స్టాగ్రామ్ లో నిరంత‌రం యోగా సెష‌న్స్ జిమ్ వర్కవుట్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూనే ఉంది. ఇక జిమ్ లో స్వేధం చిందించినా.. ఎంతో స్టైలిష్ డ్రెస్సింగ్ సెన్స్ తో ఇప్ప‌టికే అభిమానుల‌కు చెమటలు పట్టిస్తోంది. అంత‌గా స్పోర్ట్ లుక్ తో క‌వ్వించ‌డం జాన్వీ ప్ర‌త్యేక‌త‌.

శనివారం ముంబై శివారులోని జిమ్ లో జాన్వీ కనిపించింది. పింక్ ట్యాంక్ టాప్ లేత ఆకుపచ్చ జాగర్ షార్ట్ ధ‌రించి బ్లాక్ షూస్ లో కనిపించింది. త‌న హెయిర్ ని సింపుల్ గా ఓపెన్ గా ఉంచి.. ఫోటోగ్రాఫ‌ర్ల ముందు హొయ‌లు పోయింది. కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ.. బ్లాక్ మాస్క్ తో జాన్వీ క‌నిపించింది. వర్కౌట్ సెషన్ తర్వాత రీఫ్రెష్ అయ్యేందుకు వెళుతోంది.

పరిశ్రమలోని అంద‌రు ఫిట్ నెస్ ఫ్రీక్ లకు లాక్ డౌన్ కష్టం త‌ప్ప‌లేదు. కొన్ని నెల‌లుగా న‌గ‌రంలో జిమ్ లు మూసివేసి ఉన్నాయి. కానీ ఇప్పుడు జిమ్ లు తెరిచినప్పటి నుండి జాన్వి ఎప్పుడూ సెషన్ ను కోల్పోలేదు. గత నెలలో జాన్వి ఒక జిమ్ నుండి బయటకు వ‌స్తూ ఆరెంజ్ క్రాప్ టాప్ వైట్ జాగర్ షార్ట్స్ లో కనిపించింది. అప్పుడు కూడా ఇలానే ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళ్లాయి. కుర్ర‌బ్యూటీ హాట్ లుక్ పై యూత్ లో వేడిగా చ‌ర్చ సాగింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... జాన్వీ చివరిగా రూహీలో రాజ్ కుమార్ రావు వరుణ్ శర్మతో కలిసి కనిపించింది. ఆమె తరువాత గుడ్ లక్ జెర్రీలో కనిపించనుంది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దక్షిణాది చిత్రానికి రీమేక్ .. ఆనంద్.ఎల్.రాయ్ నిర్మిస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న `దోస్తానా 2` లో కూడా జాన్వీ కనిపిస్తుంది. అలాగే క‌ర‌ణ్ బ్యాన‌ర్లోనే మ‌రో కొత్త సినిమా కి కూడా సంత‌కం చేసింది. `దోస్తానా-2` చిత్రీక‌ర‌ణ పూర్తిచేసిన త‌ర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల్సి ఉంది.

టాలీవుడ్ ఆరంగేట్రం ఎపుడు?

ఇక సౌత్ లోనూ ఎంట్రీ ఇవ్వాల‌ని జాన్వీ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హేష్.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న జాన్వీ క‌థానాయిక‌గా న‌టించేందుకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా మ‌హేష్ స‌ర్కార్ వారి పాట త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక బ్యాన‌ర్ లో న‌టిస్తున్నారు. ఈ మూవీతోనే టాలీవుడ్ లో జాన్వీ క‌థానాయిక‌గా ఎంట్రీ ఉంటుంద‌ని తెలిసింది.