Begin typing your search above and press return to search.

గురుశిష్యుల బంధం అంటే ఇదేనేమో..!

By:  Tupaki Desk   |   17 Jun 2021 4:30 AM GMT
గురుశిష్యుల బంధం అంటే ఇదేనేమో..!
X
సుకుమార్ ఓ వైపు పెద్ద సినిమాలకు దర్శకత్వం చేస్తూ బిజీగా ఉంటూనే.. మరోవైపు హోమ్ ప్రొడక్షన్ లో చిన్న సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో తన వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన శిష్యులను దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇటీవల 'ఉప్పెన' సినిమాతో తన ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. దీనికి సుక్కూ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అంతేకాదు స్టోరీ - స్క్రీన్ ప్లే - ఎడిటింగ్.. ఇలా అన్ని విషయాలలో బుచ్చిబాబు వెనకుండి నడిపించాడు.

'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో వరుస ఆఫర్స్ వస్తున్నప్పటికీ తన గురువు సలహా మేరకు అడుగులు వేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే రెండో సినిమా చేయడానికి కమిటైన సుకుమార్ శిష్యుడు.. ఇప్పటికే ఎన్టీఆర్ కు ఓ కథ చెప్పాడు. తారక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. ఇప్పట్లో హీరో డేట్స్ దొరికే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ సైన్ సినిమాలు కంప్లీట్ చేసుకొని బుచ్చి దగ్గరకు రావాలంటే చాలా సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలో అల్లు కాంపౌండ్ లో వాలిపోయిన బుచ్చిబాబు.. ఇటీవల అల్లు అర్జున్ ని కలిసి ఓ కథ చెప్పారట. దీనికి సుక్కూ తన వంతు సహాయం చేశారట. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసేలా ప్లాన్స్ చేసుకుంటున్న బన్నీ.. ఎక్కువ అనుభవంలేని బుచ్చిబాబుకు అవకాశం ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారట. ఇప్పుడు బన్నీ ఓకే చెప్పినా ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది.

అందుకే ఇప్పుడు బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా సెట్ చేసే బాధ్యత సుకుమార్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. మరో స్టార్ హీరోతో తన శిష్యుడితో కథ చెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అదే సమయంలో బుచ్చి కూడా తన గురువుకు 'పుష్ప 2' స్క్రిప్ట్ విషయంలో తన వంతు సహాయం చేస్తున్నాడట. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న బుచ్చి తదుపరి ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.