Begin typing your search above and press return to search.

అన్ స్టాప‌బుల్.. ఈ సారి ఆ ఇద్ద‌రు కూడా వ‌స్తార‌ట‌!

By:  Tupaki Desk   |   3 Dec 2022 2:30 AM GMT
అన్ స్టాప‌బుల్.. ఈ సారి ఆ ఇద్ద‌రు కూడా వ‌స్తార‌ట‌!
X
సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా కూడా త‌న‌దైన స‌త్తాని చాటుకుంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు నంద‌మూరి అభిమానుల్ని కూడా స‌ర్ ప్రైజ్ చేస్తున్నారు. వెండితెర‌పై త‌న‌దైన మార్కు సినిమాల‌తో మాస్ డైలాగ్ లని అలోక‌గా ప‌లుకుతూ ఫ్యాన్స్ ని ఉర్రూత‌లూగిస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ `ఆహా` కోసం మొద‌లు పెట్టిన అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె`తో ర‌చ్చ ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ సీజ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో రీసెంట్ గా సీజ‌న్ 2ని స్టార్ట్ చేశారు.

ఈ సీజ‌న్‌ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంటోంది. సినీ సెల‌బ్రిల‌తో ఫ‌స్ట్ సీజ‌న్ ని న‌డిపిస్తే సెకండ్ సీజ‌న్ లో పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం తెలిసిందే. మాజీ ముఖ్య‌మంత్రి, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ ల‌తో సీజ‌న్ 2 ని ప్రారంభించారు. ఆ త‌రువాత యంగ్ హీరోలు విశ్వ‌క్ సేన్‌, సిద్దూ జొన్న‌లగ‌డ్డ సంద‌డి చేయ‌డం.. ఆ వెంట‌నే శర్వా, అడివి శేష్ బాల‌య్య‌ని ఆట‌ప‌ట్టించ‌డం.. అందుకే మీ లాంటి వాళ్ల‌ని ఈ షోల‌కి పిల‌వ‌కూడ‌ద‌ని బాల‌య్య సెటైర్ వేయ‌డం న‌వ్వులు పూయించింది.

ఇలా ప్ర‌తీ ఎపిసోడ్ దానిక‌దే ప్ర‌త్యేకంగా వుంటూ అన్ని వ‌ర్గాల‌ని ఆక‌ట్టుకుంటూ వుండంటంతో సీజ‌న్ 2 కూడా భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంటూ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. తాజాగా ఈ టాక్ షోలోకి మాజీ ఉమ్మ‌డి ఏపీ చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి రావ‌డం తెలిసింది. రీసెంట్ గా కె. రాఘ‌వేంద్ర‌రావు, డి. సురేష్ బాబు, అల్లు అర‌వింద్‌, ఏ. కోదండ‌రామిరెడ్డిల‌కు సంబంధించిన స్పెష‌ల్ ఎపిసోడ్ ని డిసెంబ‌ర్ 2 శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల‌కు స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇదిలా వుంటే ఈ సీజ‌న్ ని మ‌రింత సమ్‌థింగ్ స్పెష‌ల్ గా మార‌బోతున్నార‌ట‌. ఇందుకోసం ప‌లువురు క్రేజీ స్టార్ ల‌ని కూడా ఈ షోలోకి తీసుకురానున్నార‌ట‌. త్వ‌ర‌లో ఇద్ద‌రు స్నేహితులు ప్ర‌భాస్, గోపీచంద్ లు రాబోతున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా వున్నాడు. ఎంత బిజీగా వున్నా స‌రే బాల‌య్య షోకు రావ‌డానికి అంగీక‌రించే అవ‌కాశం వుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇక గోపీచంద్ కూడా ప్ర‌భాస్ తో క‌లిసి రావ‌డానికి ఆస‌క్తిగా వున్నాడ‌ని తెలుస్తోంది.

వీరితో పాటు క‌ళాత‌పస్వీ కె. విశ్వ‌నాథ్ తోనూ వ‌ర్చువ‌ల్ టాక్ షోని కూడా `ఆహా` ప్లాన్ చేస్తోంది. ఇక వీరి త‌రువాత అల‌నాటి క్రేజీ హీరోయిన్ లు జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ కూడా ఈ షోలో పాల్గొనే అవ‌కాశం వుంద‌ని, ఇప్ప‌టికే వారితో `ఆహా` టీమ్ చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. మ‌రి ఈ ఇద్ద‌రితో బాల‌య్య టాక్ షో ఎలా వుండ‌బోతోందో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.