Begin typing your search above and press return to search.

'#SSMB28' చిత్రానికి 'భీష్మ' డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడా..?

By:  Tupaki Desk   |   4 May 2021 7:31 AM GMT
#SSMB28 చిత్రానికి భీష్మ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడా..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 'అతడు' 'ఖలేజా' వంటి క్లాసిక్స్ తర్వాత వీరి కలయికలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా '#SSMB28' తెరకెక్కనుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్ పై ఎస్‌.రాధాకృష్ణ(చిన్నబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ కాంబోలో రూపొందే సినిమాకి డైరెక్టర్ వెంకీ కుడుముల స్టోరీ అందిస్తున్నాడనే గాసిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర పని చేసిన వెంకీ కుడుముల 'ఛలో' అనే సక్సెస్ ఫుల్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో 'భీష్మ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 'భీష్మ' హిట్ కొట్టిన వెంట‌నే వెంకీకి మ‌హేశ్ నుంచి పిలుపు వ‌చ్చిందని.. త‌న కోసం ఓ క‌థ రెడీ చేయాల్సిందిగా వెంకీకి ఆర్డ‌ర్ వేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో మహేష్ - వెంకీ కుడుముల కాంబోలో ఓ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్టే వెంకీ కూడా మ‌హేశ్ కోసం ఓ భారీ బ‌డ్జెట్ స్టోరీ సిద్ధం చేశాడట.

అయితే అంత పెద్ద సినిమాను వెంకీ కుడుముల ప్రాప‌ర్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడో లేదో అనే డౌట్ తోనే ఆ ప్రాజెక్ట్ ని ఇప్పుడు త్రివిక్ర‌మ్ చేతికి అప్ప‌చెప్పిన‌ట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 'భీష్మ' సినిమా తర్వాత వెంకీ మరో సినిమా అనౌన్స్ చేయకపోవడంతో.. తన గురువు త్రివిక్రమ్ కి చేదోడువాదోడుగా నిలుస్తున్నట్లు ఆ మధ్య ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు '#SSMB28' కోసం వెంకీ వర్క్ చేస్తున్నాడనే న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.