Begin typing your search above and press return to search.

మీరా చోప్రా ఇష్యూ తారక్ ని ఇబ్బంది పెడుతోందా...?

By:  Tupaki Desk   |   7 Jun 2020 11:30 PM GMT
మీరా చోప్రా ఇష్యూ తారక్ ని ఇబ్బంది పెడుతోందా...?
X
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ హీరోయిన్ మీరా చోప్రా ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ నిర్వహించిన మీరా చోప్రా.. మహేష్ బాబు తన ఫేవరేట్ హీరో అని.. ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని.. నేను ఆయన ఫ్యాన్ ని కాదని పేర్కొంది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల పేరుతో కొంతమంది ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ తో దాడికి దిగారు. దీనితో ఆమె వాటిని స్క్రీన్ షూట్స్ తీసుకొని తెలుగు రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ ''మీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా'' అని ప్రశ్నించింది మీరా చోప్రా. తన ట్వీట్‌ పై ఎన్టీఆర్ తప్పకుండా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాకుండా జాతీయ మహిళా కమీషనర్, ఏపీ సీఎం, తెలంగాణా మినిస్టర్ కేటీఆర్ లకు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. దీంతో జాతీయ స్థాయిలో ఈ విషయం చర్చకు దారి తీసింది. మీరా చోప్రా అభిమానులు.. యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు అనేక మంది ఫెమినిస్ట్ లు ఆమెకు సపోర్ట్ చేసారు. మినిస్టర్ కేటీఆర్ మీరా ట్వీట్ కి రెస్పాండ్ అయ్యి దర్యాప్తు చేయమని పోలీసులకు చెప్పినట్లుగా వెల్లడించారు.

అయితే ఈ ఇష్యూపై ఎన్టీఆర్ మాత్రం ఇంకా స్పందించలేదు. నిజానికి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్న ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోని ఒకరిద్దరు చేసే పనులకు అతనే కారణమన్నట్లు పాయింట్ అవుట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది కొంతమంది వాదన. అసలు ఆ కామెంట్స్ చేసిన వారు తారక్ ఫ్యాన్స్ అనేది నిజమో కాదో అనేది కూడా ఇంకా నిర్ధారించలేదు. సినీ ఇండస్ట్రీలో అందరి హీరోల ఫ్యాన్స్ ఇలానే బిహేవ్ చేస్తుంటారు. అయితే వారు చేసే తప్పుడు పనులకు హీరోని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని తారక్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే మీరా చోప్రా మాత్రం 'హీరోలు తమ ఫ్యాన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ గురించి తెలుసుకోవాలి. ఇలాంటి అనుచిత ప్రవర్తనను వారు ఖండించాలి. ఫ్యాన్స్ తమ ఫేవరైట్ హీరోల్ని దేవుళ్లుగా భావిస్తారు. కాబట్టి దేవుళ్ల మాటల్ని కచ్చితంగా వింటారని నా ఒపీనియన్. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి'' అని చెప్తూ ఉంది.

కాగా ఎన్టీఆర్ ఈ విషయంపై తీవ్ర మనస్థాపానికి గురయ్యాడంట. తాత నందమూరి తారకరామారావు గారి దగ్గర నుండి ఇప్పటి ఎన్టీఆర్ వరకు మహిళకు చాలా గౌరవం ఇస్తారనే పేరుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇతర హీరోలపై.. హీరోయిన్స్ పై అసభ్యకరంగా కామెంట్స్ చేసే వారు అసలు నా ఫ్యాన్స్ అని అనుకోను అంటూ ఎన్టీఆర్ ప్రకటించారు కూడా. అలాంటిది ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ పేరుతో జరుగుతున్న ఈ ఇష్యూ ఆయనను ఇబ్బందిని గురి చేస్తోందట. ఎప్పుడూ ఎలాంటి వివాదాల్లో తల దూర్చకుండా తన పని తాను చేసుకుపోయే ఎన్టీఆర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో అని సినీ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.