Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ పవర్ స్టార్ ని ఖుషీ చేయాలని చూస్తున్నాడా...?

By:  Tupaki Desk   |   28 April 2020 4:30 PM GMT
ఆ డైరెక్టర్ పవర్ స్టార్ ని ఖుషీ చేయాలని చూస్తున్నాడా...?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎస్.జే. సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'ఖుషీ'. భూమిక చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప‌వ‌న్‌ కళ్యాణ్ ను యూత్‌ లో తిరుగులేని స్టార్‌ ను చేసేసింది. పవన్ సినిమాల్లో అప్పటి దాకా 'తొలిప్రేమ' తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయిన సినిమా అంటే 'ఖుషీ' అనే చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత వచ్చిన చాలా చిత్రాలు 'ఖుషీ'ని మించిపోలేకపోయాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఒక తెలుగు సినిమాలో పూర్తి హిందీ లిరిక్స్ తో కూడిన పాటని పెట్టడం అన్నది కూడా అప్పట్లో సెన్సేషన్. ఎస్.జే. సూర్య క్రియేట్ చేసిన ఎన్నో అంశాలు యూత్ ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ప‌వ‌న్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్‌.. హెయిర్ స్టైల్‌.. ప‌వ‌న్ వేసుకున్న బ్యాగ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌ అని చెప్పొచ్చు. 2001లో విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయ్యి స‌రిగ్గా 19 ఏళ్ళు అవుతోంది. దీనికి గుర్తుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ #19YearsForClassicHitKushi అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఒక పవర్ స్టార్ ఫ్యాన్ 'ఖుషీ' సినిమా డైరెక్టర్ ఎస్.జే. సూర్యని ట్యాగ్ చేస్తూ 'పవన్ కళ్యాణ్ గురించి వన్ వర్డ్ లో చెప్పమంటే ఏమి చెప్తారు' అని ట్వీట్ చేసాడు. దీనిపై వెంటనే స్పందించిన ఎస్.జే. సూర్య 'నాయకుడు' అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ విధంగా ఈ తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని తెలియజేసాడు. ఈ ట్వీట్ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయమని ఎస్.జే. సూర్యని రిక్వెస్ట్ చేసారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎస్.జే. సూర్య కాంబినేషన్ లో ఇంతకముందు 'ఖుషీ' సినిమాతో పాటు 'కొమరం పులి' సినిమా కూడా రూపొందింది. 'ఖుషీ' సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలిచిపోగా 'కొమరం పులి' డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు సూర్య తాజా ట్వీట్ తో మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కోరుకుంటున్నాడా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా అవుతుంది. ఇదిలా ఉండగా తమిళ్ లో ఫుల్ బిజీగా ఉండే ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్.జే. సూర్య తెలుగులో కేవలం మూడు సినిమాలకి డైరెక్షన్ చేయగా.. మహేష్ బాబు హీరోగా నటించిన 'స్పైడర్' సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా నిరాశపరిచినప్పటికీ ఎస్.జే. సూర్యకి మాత్రం మంచి పేరుని తీసుకొచ్చింది. గతంలో ఎస్.జే. సూర్య మహేష్ బాబుతో 'నాని' సినిమా చేసిన విషయం తెలిసిందే.