Begin typing your search above and press return to search.

డైరెక్టర్ మారుతీ ఓటిటి సినిమాకు ఇంటరెస్టింగ్ టైటిల్..?

By:  Tupaki Desk   |   16 Jun 2021 11:30 PM GMT
డైరెక్టర్ మారుతీ ఓటిటి సినిమాకు ఇంటరెస్టింగ్ టైటిల్..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ టైంలో సినిమాలు తెరకెక్కించే దర్శకులలో మారుతీ ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి సక్సెస్ రేట్ ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నాడు. చివరిగా ప్రతిరోజూ పండగే సినిమా తర్వాత మారుతీ నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో గోపీచంద్ ప్రధానపాత్రలో 'పక్కా కమర్షియల్' అనే సినిమా లైన్ లో పెట్టాడు. దానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే కరోనా కారణంగా సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలా లేదని ఆల్రెడీ ఆహా ఓటిటి కోసం ఓ చిన్న సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మేజర్ పార్ట్ పూర్తి అయిపోయిందట. 'ఏక్ మినీ కథ' మూవీతో హిట్ అందుకున్న యువహీరో సంతోష్ శోభన్ హీరోగా మారుతీ సినిమా రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందని టాక్. చాలా తక్కువ రోజుల్లో సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో మారుతీ ప్రణాళిక చేసుకున్నాడట. అయితే ఈ సినిమాలో సంతోష్ జోడిగా హీరోయిన్ మెహరీన్ కనిపించనుంది. మరి కుర్రహీరోతో అమ్మడి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. యూవి క్రియేషన్స్ వారు సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఏంటంటే.. సినిమాకు మారుతీ టీమ్ ఓ ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టిందట. ఆ టైటిల్ కూడా వాడుక భాషలో నుండే తీసుకున్నారని టాక్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే 'మంచి రోజులు వచ్చాయి' అనే పేరు సినిమాకు ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరి టైటిల్ బట్టి చూస్తే సినిమా లాక్ డౌన్ నేపథ్యంలో ఉండబోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మినీ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. గోపీచంద్ పక్కా కమర్షియల్ మూవీ పూర్తి వినోదంతో కూడి ఉంటుందని తెలుస్తుంది. అందులో రాశిఖన్నా హీరోయిన్ గా ఖరారైంది. చూడాలి మరి త్వరలోనే షూటింగ్ డేట్ ప్రకటిస్తారేమో!