Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో సౌండింగ్ కావాలంటే కరణ్ జోహార్ త‌లుపు తడితే సరి..!

By:  Tupaki Desk   |   19 Jun 2021 3:30 AM GMT
బాలీవుడ్ లో సౌండింగ్ కావాలంటే కరణ్ జోహార్ త‌లుపు తడితే సరి..!
X
టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెడుతున్నారు. క్రేజ్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ లో సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. అయితే బాలీవుడ్ ఎంట్రీ కోసం బీ టౌన్ ప్రముఖుల సపోర్ట్ కూడా అవసరం అవుతోంది. కరణ్ జోహార్ - అమన్ గిల్ లాంటి నిర్మాతలు.. జయంతి లాల్ గడ వంటి డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ సహాయంతో ఇప్పుడు మన హీరోలు అక్కడ అడుగుపెడుతున్నాడు. వీరిలో కూడా కరణ్ కంటిలో పడితే మరికొన్ని సినిమా అవకాశాలకు డోకా ఉండదనే ఆలోచనలో ఉంటున్నారు.

మొదటి నుంచీ టాలీవుడ్ హీరోలతో టచ్ లో ఉంటూ వస్తున్న కరణ్ జోహార్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ను హిందీ పరిశ్రమకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ క్రేజ్ చూసి.. 'లైగర్' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

కరణ్ జోహార్ వచ్చి చేరిన తర్వాతే 'లైగర్ సాలా క్రాస్ బ్రీడ్' సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం VD చిత్రానికి పెట్టుబడి పెడుతున్న కరణ్.. యువ హీరో యాక్టింగ్ కి మెచ్చి మ‌రో బాలీవుడ్ ఆఫ‌ర్ కూడా ఇస్తున్నాడని బీ టౌన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది తెలుసుకున్న కొంతమంది సౌత్ కుర్ర హీరోలు బాలీవుడ్ లో సౌండింగ్ కావాలంటే కరణ్ త‌లుపు తట్టాల్సిందేననే ర‌హ‌స్యాన్ని ప‌సి గట్టారట. అందుకే ఇప్పుడు వీళ్లంతా బాలీవుడ్ ప్రొడ్యూసర్ స‌న్నిహితుల్ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతున్న‌ట్లుగా టాక్ వినిపిస్తోంది.