Begin typing your search above and press return to search.

`ప‌రుగు 2` క‌థ అటు తిరిగి ఇటు తిరిగి..!

By:  Tupaki Desk   |   9 Aug 2020 4:45 AM GMT
`ప‌రుగు 2` క‌థ అటు తిరిగి ఇటు తిరిగి..!
X
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `ప‌రుగు` బాలీవుడ్ లో టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా `హీరో పంతి` పేరుతో రీమేకైన సంగ‌తి తెలిసిందే. ప‌రుగుకి బొమ్మరిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. హీరో పంథికి ష‌‌బ్బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు వెర్ష‌న్ కి దిల్ రాజు నిర్మాత కాగా.. హిందీలో సాజిద్ న‌డియావాలా నిర్మించారు. తెలుగులో షీలా కౌర్ క‌థానాయికగా న‌టిస్తే.. హిందీలో కృతి స‌నోన్ ఆ పాత్ర‌ను పోషించింది. హిందీ వెర్ష‌న్ ఘ‌న‌విజ‌యం సాధించి అప్ప‌ట్లోనే 25 కోట్లు క‌లెక్ష‌న్స్ ద‌క్కాయి.

ఆ త‌ర్వాత హీరో పంథి సీక్వెల్ గురించి ఎన్నో క‌థ‌నాలొచ్చాయి. టైగ‌ర్ ఆస‌క్తిగా ఉన్నాడ‌ని హీరో పంథి సీక్వెల్ క‌థ‌ను ష‌బ్బీర్ - న‌డియావాలా బృందం సిద్ధం చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా స్క్రిప్టు రెడీ అయ్యింది. సీక్వెల్లో టైగ‌ర్ ష్రాఫ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఈ మూవీలో బ‌న్ని ఓ కీల‌క పాత్ర పోషించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెచ్చార‌ట‌.

ఇందులో గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని ఆ మూవీ మేకర్‌ సాజిద్ డైరెక్టుగా బన్నీని అప్రోచ్ అయ్యినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ర‌కంగా మళ్ళీ `పరుగు 2` కథ అల్లు అర్జున్ దగ్గరకు వచ్చిందని తెలుస్తోంది. అయితే దీనికి బ‌న్ని నుంచి ఎలాంటి స్పంద‌న వ‌చ్చింది? అన్న‌ది తెలియాల్సి ఉంది. బ‌న్ని ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప` చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మూవీతో పాటు ప‌లువురు స్టార్ డైరెక్టర్లు వినిపించిన లైన్లు విన్నాడు. కొర‌టాల‌తోనూ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత బిజీలో బాలీవుడ్ మూవీకి బ‌న్ని ఓకే చెబుతాడా లేదా? అన్న‌ది చూడాలి.

HeroPanti Sequel Makers Approached Allu Arjun For Guest Role