Begin typing your search above and press return to search.

ఇప్పటికి స్క్రిప్ట్ విషయంలో కన్ఫ్యూషన్.. అందుకే ప్లాప్స్

By:  Tupaki Desk   |   6 March 2021 11:30 PM GMT
ఇప్పటికి స్క్రిప్ట్ విషయంలో కన్ఫ్యూషన్.. అందుకే ప్లాప్స్
X
టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు నవదీప్. 2004లో జై అనే సినిమాతో తెలుగులో హీరోగా అడుగుపెట్టాడు. కానీ ఎందుకో ఎక్కువకాలం హీరోగా నిలబడలేకపోయాడు. కెరీర్ పరంగా చాలా సినిమాలే చేసాడు కానీ మధ్యలో ఎన్నో సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో వెనకబడిపోయాడు. స్క్రిప్ట్ సెలక్షన్ లో అవగాహనా లేకపోవడం కారణంగానే తన కెరీర్ ఇలా మారిందని ఒప్పుకున్నాడు నవదీప్. కానీ ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏం లాభం. హీరోగా సక్సెస్ లో ఉన్నప్పుడే జాగ్రత్తపడి ఉంటే ఇప్పుడు వేరే హీరోల సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో. అయితే ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన సినిమా మోసగాళ్లు.

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటించగా.. నవదీప్, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు దగ్గర పడటంతో మోసగాళ్లు ప్రమోషన్స్ లో భాగంగా నవదీప్ పలు విషయాలు బయటపెట్టాడు. ఇప్పటికే సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవదీప్ హీరో, హీరోయిన్లకు సూత్రధారి టైప్ క్యారెక్టర్ చేసానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 'కొన్నేళ్లుగా సరైన స్క్రిప్ట్ ఎంచుకోవడంలో నాకు అవగాహన లేదనిపిస్తుంది. అందుకే స్క్రిప్ట్స్ విషయంలో ఊరికే కన్ఫ్యూస్ అవుతుంటాను. మధ్యలో చాలామంది స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ లతో సినిమాలు చేసాగాని అవి కూడా ప్లాప్స్ అయ్యాయి. అలాగే నాకు సరైన సినిమాలు దొరికే వరకు ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇంకోసారి బ్యాడ్ మూవీస్ మాత్రం చేయను' అంటున్నాడు ఈ హీరో. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నట్లు సమాచారం.