Begin typing your search above and press return to search.

యూవీ భార్య నిర్ణయంతో ఫ్యాన్స్‌ షాక్‌

By:  Tupaki Desk   |   5 March 2021 6:30 AM GMT
యూవీ భార్య నిర్ణయంతో ఫ్యాన్స్‌ షాక్‌
X
మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ భార్య హజెల్‌ బంధు మిత్రులకు మరియు అభిమారులకు రాసిన ఒక లేఖ హాట్‌ టాపిక్ గా మారింది. ఆమె కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు మెసేజ్ లకు దూరంగా ఉండబోతున్నట్లుగా అందులో పేర్కొన్నారు. బాలీవుడ్ నటి అయిన హజెల్ కీచ్‌ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యంగా ఉంది. కేవలం అభిమానులతో మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ అండ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ తో కూడా ఈమె కాస్త దూరం మెయింటెన్ చేయాలనుకోవడం హాట్‌ టాపిక్ గా నిలిచింది. నా ఫోన్ తో నేను బ్రేక్‌ తీసుకుంటున్నా. ఈ విషయం కాస్త షాకింగ్ గా ఉన్నా తప్పడం లేదు. అంటూ తన లేఖలో హజెల్‌ పేర్కొన్నారు.

ఒకరిపై ఒకరం ఆధారపడటం అలవాటైన మనం కొంత కాలం మన వారికి దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది చూసేందుకు ఈ బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. అర్జంట్ అయితే కాల్‌ చేయవచ్చు అంటూ సూచించింది. ఇక ఈ బ్రేక్ అనేది తాత్కాలికం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే మళ్లీ తాను సోషల్ మీడియాలో యాక్టివ్‌ అవుతాను అని ఖచ్చితంగా మీతో మాట్లాడేందుకు చిట్‌ చాట్‌ కు సిద్దంగా ఉంటాను అంటూ పేర్కొన్నారు. ఉన్నట్లుండి హజెల్ తీసుకున్న ఈ బ్రేక్‌ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.