Begin typing your search above and press return to search.

గురూజీ స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నాడ‌ట‌గా..!

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:30 AM GMT
గురూజీ స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నాడ‌ట‌గా..!
X
మాట‌ల మాంత్రికుడు,.. గురూజీ త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌ తో పాటు ఇత‌ర బాధ్య‌త‌ల్లోనూ త‌ల‌మున‌క‌లౌతున్నారు. స్నేహితుడు స్టార్ హీరో ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ న‌టిస్తున్న రీమేక్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` ఆధారంగా రూపొందుతున్న `భీమ్లా నాయ‌క్‌` చిత్రానికి త్రివిక్ర‌మ్‌ స్క్రీన్‌ ప్లే తో పాటు డైలాగ్స్ అందిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌ క‌ల్యాణ్ డిమాండ్ చేయ‌డం వ‌ల్లే ఆయ‌న ఈ బాధ్య‌త‌ల్ని త‌న భుజాన వేసుకున్నారు. అంతే కాకుండా వీరిద్ద‌రి మ‌ధ్య వున్న స్నేహం కార‌ణంగా సెట్‌ లోనూ త‌ను వుండాల్సిందేన‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారంట‌.

ఇదిలా వుంటే ప‌వ‌ర్‌ స్టార్ తాజాగా గురూజీకి మ‌రో బాధ్య‌త‌ని కూడా అప్ప‌గించిన‌ట్టు తెలిసింది. తాజాగా నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్ర‌మ్‌ కు ప‌వ‌న్ త‌న సొంత నిర్మాణ సంస్థ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ సంస్థ బాధ్య‌త‌ల్ని కూడా తాజాగా అప్ప‌గించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్నేళ్లుగా ఈ బ్యాన‌ర్‌ పై రామ్‌ చ‌ర‌ణ్‌ తో ఓ సినిమా, నితిన్‌ తో ఓ మూవీతో పాటు యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ‌ల‌ని ప్రోత్స‌హించాల‌ని.., వారితో ఓటీటీల కోసం చిన్న చిత్రాల‌ని, వెబ్ సిరీస్ ‌ల‌ని నిర్మించాల‌ని ప‌వ‌న్ ప్లాన్ చేశారు. ఇందు కోసం పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి ముందుకు సాగుతామ‌ని ప్ర‌క‌ట‌న కూడా చేశారు.

కానీ ఆ ప్ర‌క‌ట‌న ఇప్ప‌టికీ ఇంచు కూడా ముందుకు క‌ద‌లలేదు. పైగా ప‌వ‌న్ వ‌రుస ప్రాజెక్ట్ ‌ల‌తో బిజీగా వుండ‌టం వ‌ల్ల నిర్మాణ సంస్థ బాధ్య‌త‌ల‌ని చూసుకోలేక‌పోతున్నారు. ఇది గ‌మ‌నించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ప‌వ‌న్‌ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ సంస్థ బాధ్య‌త‌ల్ని గురూజీకి అప్ప‌గించాల‌ని భావిస్తున్నార‌ట‌. న్యూ టాలెంట్ ‌ని ఎంక‌రేజ్ చేయ‌డం, ..వారి క‌థ‌ల్ని విని ఫైన‌ల్ చేయ‌డం వంటివి చూసుకుంటూ నిర్మాణ బాధ్య‌త‌ల్ని చూసుకోవాల‌ని ప‌వ‌న్ గురూజీని అడిగిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

గురూజీ కూడా ఈ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌డానికి స‌ముఖంగానే వున్నార‌ట‌. త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌ బాబుతో ఓ భారీ చిత్రాన్ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. సితార ఎంట‌ర్ ‌టైన్‌ మెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ మూవీ షూటింగ్ ‌కి ముందే ప‌వ‌న్‌ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ సంస్థ కోసం ఓ క‌థ‌ని ఓకే చేసి దాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నార‌ట‌. అయితే ఈ ప్రాజెక్ట్ ‌లో గురూజీ భాగ‌స్వామి అవుతారా? లేక ప‌వ‌న్ సోలో నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రిస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.