Begin typing your search above and press return to search.

లఘుచిత్రంగా శింబు-త్రిషల రొమాంటిక్ మ్యాజిక్

By:  Tupaki Desk   |   16 May 2020 11:10 AM GMT
లఘుచిత్రంగా శింబు-త్రిషల రొమాంటిక్ మ్యాజిక్
X
పదేళ్ల క్రితం.. డైరెక్టర్ గౌతమ్ మీనన్.. నటీనటులు శింబు, త్రిష జంటగా ఓ క్లాసిక్‌ లవ్‌ స్టోరీ తెరకెక్కించాడు అదే ‘విన్నైత్తాండి వరువాయా’. తెలుగులో నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా ‘ఏ మాయ చేసావే’ పేరుతో రూపొందించారు. విడుదలైన రెండు బాషలలో ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తానంటూ ఎప్పుడో ప్రకటించాడు డైరెక్టర్ గౌతమ్ మీనన్. తాజాగా విన్నైత్తాండి వరువాయా సినిమాలోని జెస్సీ, కార్తీక్‌ పాత్రలతో ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కిస్తున్నారు గౌతమ్. ‘కార్తీక్‌ డయల్‌ సెయ్ద ఎన్‌’ టైటిల్‌తో ఈ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కింది. ఈ షార్ట్ ఫిల్మ్ టీజర్ కూడా హీరోయిన్ త్రిష విడుదల చేసింది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ లో హీరో శింబు, త్రిష ఎవరింట్లో వారే ఉండి నటించారు. త్వరలోనే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘విన్నైత్తాండి వరువాయా’ సీక్వెల్‌ ఎలా ఉండబోతోందో ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా ఓ టీజర్‌లా చూపించాడు డైరెక్టర్ గౌతమ్ మీనన్‌.

ఇటీవలే హీరోయిన్ త్రిష, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లు ప్రేక్షకులకు సోషల్ మీడియా వేదికగా సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ మధ్య హీరోయిన్ త్రిష.. గౌతమ్ మీనన్ తో వీడియో కాల్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కెమెరాను 4కే ఫిక్స్ చేసి షార్ట్ ఫిల్మ్ ఎలా షూట్ చేయాలో సూచనలు ఇచ్చాడట. ఆ కాల్ అప్పుడే వీరిద్దరూ కలిసి ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వనున్నారని ఎక్సపెక్ట్ చేశారు. ఫ్యాన్స్ అనుకున్నట్లే షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్ చేశారు. "కార్తిక్ డయల్ సితాయెన్" షార్ట్ ఫిల్మ్ లో జెస్సీగా త్రిష.. తన బాయ్ ఫ్రెండ్ కార్తిక్ తో ఫోన్లో మాట్లాడుతుంది. "కార్తిక్ నువు గొప్ప ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. లాక్ డౌన్ వల్ల నువ్ నెర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు. త్వరలో మళ్లీ థియేటర్లు తెరుచుకుంటాయి. నువు గొప్ప కంటెంట్ రాయగలవు" అంటూ భరోసా ఇస్తూ షార్ట్ ఫిల్మ్ టీజర్ సాగింది. ఇక ఏఆర్ రెహమాన్ మళ్లీ తన మ్యాజిక్ చూపించనున్నారట. ప్రస్తుతం "కార్తీక్ డయల్ సెయితాయెన్" టీజర్ నెట్టింట వైరల్ అయి చక్కర్లు కొడుతోంది.