Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః 30 ఏళ్ల తర్వాత 'గ్యాంగ్‌ లీడర్' బ్రదర్స్

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:40 AM GMT
ఫొటోటాక్‌ః 30 ఏళ్ల తర్వాత గ్యాంగ్‌ లీడర్ బ్రదర్స్
X
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరో వైపు మురళి మోహన్ ఆర్కా మీడియా వారి షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లారు. తమిళ సీనియర్‌ హీరో శరత్‌ కుమార్‌ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే మణిరత్నం మూవీ షూటింగ్ లో ఉన్నారు. మురళి మోహన్‌ మరియు శరత్‌ కుమార్‌ లు కలిసి ఆచార్య షూటింగ్‌ సెట్‌ కు వెళ్లి చిరంజీవిని కలవడం జరిగింది. వీరు ముగ్గురు కలిసి సరిగ్గా 30 ఏళ్ల క్రితం గ్యాంగ్ లీడర్‌ సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఈ ముగ్గురు అన్నదమ్ముల మాదిరిగా నటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరు ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్‌ లోకి వచ్చారు. దాంతో చిరంజీవితో పాటు మురళి మోహన్‌ ఇంకా శరత్‌ కుమార్‌ కూడా తమ ఆనందం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత ముగ్గురం కలవడం చాలా ఆనందాన్ని కలిగించిందని అంటున్నారు.

ఈ విషయమై మురళి మోహన్‌ స్పందిస్తూ గ్యాంగ్ లీడర్ లో కలిసి నటించిన మేము ముగ్గురం సరిగ్గా 30 ఏళ్ల తర్వాత కలుసుకోవడం ఆనందం కలిగించింది. మేము ముగ్గురం కూడా కలిసిన సమయంలో ఈ సందర్బంను మనం ఫొటో తీసుకుందాం. తప్పకుండా అభిమానులు మరియు స్నేహితులు సర్‌ప్రైజ్ అవుతారని చిరంజీవి అన్నారు. ఆ సమయంలో తీసుకున్న ఫొటోనే అది అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గ్యాంగ్ లీడర్ లోని వీరి ముగ్గురి కలయిక మరియు ఇప్పుడు వీరు తీసుకున్న ఫొటోను పక్క పక్కన పెట్టి తెగ షేరింగ్ లు చేస్తున్నారు.