Begin typing your search above and press return to search.

#PSPK27 అప్డేట్: పహిల్వాన్ లతో ఫైట్.. 200 మంది డ్యాన్సర్స్ తో సాంగ్..!

By:  Tupaki Desk   |   23 Feb 2021 1:30 PM GMT
#PSPK27 అప్డేట్: పహిల్వాన్ లతో ఫైట్.. 200 మంది డ్యాన్సర్స్ తో సాంగ్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ పీరియాడికల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 17వ శతాబ్దం కాలం నాటి ఫిక్షనల్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ 'వీరమల్లు' అనే పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రం కోసం ఇప్పటికే హైదరాబాద్ లో చార్మినార్ సెట్ మరియు ఓ ప్రత్యేకమైన దర్బార్ సెట్ ల నిర్మాణం చేపట్టారని తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ కంటే ముందు జరిగిన షెడ్యూల్ లో కీరవాణి కంపోజ్ చేసిన ఈ సినిమాలోని ఓ సాంగ్ ని షూట్ చేశారు.

తాజాగా డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఓ వెబ్ మీడియాతో మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో #PSPK27 కోసం ఓ పాటను చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఈ సాంగ్ ను 200 మంది డ్యాన్సర్స్ తో చేశామని.. థియేటర్స్ లో దుమ్ము లేచిపోద్దని.. పవర్ స్టార్ అదరగొట్టేసాడని గణేష్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రంలో హైదరాబాద్ పహిల్వాన్ లతో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నట్లు సమాచారం.

అలానే ఈ చిత్రంలో పవన్ గుర్రపు స్వారీతో పాటు కత్తిసాము కూడా చేయబోతున్నాడట. ఇదంతా చూస్తుంటే పవన్ తొలిసారి నటిస్తున్న చారిత్రాత్మక సినిమాని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారని టాక్. పవన్ ఒకవైపు 'అయ్యప్పనుమ్ కోశీయుమ్' రీమేక్ లో నటిస్తూనే మరోవైపు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.