Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన కరోనా...?

By:  Tupaki Desk   |   28 March 2020 11:30 PM GMT
టాలీవుడ్ లో నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన కరోనా...?
X
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ పడింది. కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. ఇప్పటికే మల్టీప్లెక్స్, థియేటర్స్ క్లోజ్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. హీరోల దగ్గరి నుండి చిన్న చిన్న టెక్నిషన్స్ దాకా పనులు లేక పోవడంతో ఇంటికే పరిమతమయ్యారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు తమ రిలీజ్ డేట్లను మార్చుకున్నాయి. వీటిలో అనుష్క 'నిశ్శబ్ధం', నాని 'వి', ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమకథ' సినిమాలు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

రాబోయే రోజుల్లో కరోనా ప్రభావం తగ్గి మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయితే మొదట థియేటర్లలోకి ఏ సినిమాను తీసుకురావాలనే విషయం మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద గొడవ జరుగుతుందంట. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న బడా ప్రొడ్యూసర్స్ పోటీ పడుతున్నారట. ఆల్రెడీ విడుదలై హిట్ టాక్ తెచ్చుకొని మధ్యలో ఆగిపోయిన 'భీష్మ' ని మళ్లీ తీసుకురావాలని సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు భావిస్తున్నారట. మరోవైపు మార్చి నెలలో రిలీజ్ అవ్వాల్సిన యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమకథ' చిత్రాన్ని ముందుగా తీసుకురావాలని నిర్మాత బన్నీ వాసు ట్రై చేస్తున్నాడట. మేము అదే టైం కి రావాలని 'నిశ్శబ్దం', 'వి' సినిమా నిర్మాతలు పట్టుబడుతున్నారంట. దీంతో ఇండస్ట్రీలోని పెద్ద బ్యానర్ల మధ్య కొంత ఆందోళనకర వాతావరణం నెలకొని ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాబోయే రోజుల్లో లాక్ డౌన్ ఎత్తేస్తే అప్పుడు పరిస్థితులు ఏవిధంగా మారబోతున్నాయో చూడాలి.