Begin typing your search above and press return to search.

అభిమానుల్ని చిరు ప‌ట్టించుకున్నంతగా...!

By:  Tupaki Desk   |   4 May 2021 11:30 AM GMT
అభిమానుల్ని చిరు ప‌ట్టించుకున్నంతగా...!
X
ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు క‌ష్ట‌కాలం. మ‌హ‌మ్మారీని నిలువ‌రించే వ‌ర‌కూ నిరంత‌రం పోరాడాల్సిందే. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌లు మాన‌సిక ఒత్తిళ్ల‌ను అధిగ‌మించాలంటే వారిలో స్ఫూర్తి నింపేందుకు ఏదో ఒక‌టి చేయాలి. ధైర్యం నింపే మాట‌ల్ని చెప్పాలి.

త‌న వీరాభిమాని అనారోగ్యం భారిన ప‌డ్డార‌ని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి త‌న సోద‌రుడు నాగబాబుకు ఒక ఆడియో సందేశం పంపారు. అనారోగ్యంతో ఉన్న అభిమానులకు ఈ ఆడియో సందేశాన్ని వైద్యులు ప్లే చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆడియో బైట్ లో చిరంజీవి తన అభిమానిని ఆందోళన చెందవద్దని మానసికంగా బలంగా ఉండమని అడిగారు. ఇది వ్యాధిని అధిగమించడానికి సహాయపడుతుంది. నాగ బాబు వైద్యులతో మాట్లాడార‌ని అతనికి ఉత్తమమైన చికిత్సను ఇవ్వడంలో వారు తమ వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

``మీరు నాలానే ఛారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. మానవత్వంతో సేవలు చేస్తున్నారు. వారి ప్రార్థనలు కోరికలన్నీ మీతో ఉంటాయి. మీరు త్వరలో కోలుకుంటారు`` అని చిరంజీవి అన్నారు. కోలుకున్న తర్వాత త్వరలోనే హైదరాబాద్ లో తన నివాసంలో కలుస్తామ‌ని చిరంజీవి తన అభిమానిని కోరారు. చిరంజీవి అభ‌యానికి ఆ అభిమాని కృతజ్ఞతలు తెలిపాడు. ఇది వ్యాధిని ఓడించటానికి మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. చిరంజీవి పట్టించుకునేంతగా అభిమానుల గురించి వేరే ఎవరూ పెద్దగా పట్టించుకోరని అభిమాని వైద్యుడికి తెలియజేసారు. ప్ర‌స్తుతం చిరు మాట‌ల‌తో ఆడియో సందేశం అంద‌రికీ చేరుతోంది.