Begin typing your search above and press return to search.
జాక్వెలిన్ విచారణకి రంగం..ఈడీ ప్రశ్నలకు సమాధానాలివ్వాలి!
By: Tupaki Desk | 8 Dec 2021 11:30 AM GMTమనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ ని ఈడీ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు రౌండ్లు విచారణ పూర్తయింది. తాజాగా మూడవ దఫా సమన్లు కూడా జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని ఎంటీఎన్ కార్యాలయం విచారణకు రంగం సిద్దం చేస్తోంది. ఆమె నుంచి ఈడీ ఆధికారులు వాగ్ములం నమోదు చేస్తారు. మొత్తంగా జాకీ బుధవారం విచారణలో అధికారుల నుంచి 60 ప్రశ్నలు సూటిగా వేసే అవకాశం ఉందని లీకులందాయి.
ఇప్పటికే సుకేష్ చంద్రతో సంబంధం గురించి కీలక సమాచారం రాబట్టిన నేపథ్యం..ఆదివారం జాకీకి మళ్లీ దుబాయ్ వెళ్లడానికి ఆడీ అనుమతిలివ్వడం దబాంగ్ షోలో జాకీ ఎవరెవరితో కలిసిందన్న సమాచారాన్ని సైతం ఈడీ సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదుగంటలకు పైగానే ఆమెను విచారించనున్నారని ఈడీ వర్గాల సమాచారం. దీంతో జాకీ చుట్టు ఉచ్చు మరింత బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. శనివారం జాక్వెలిన్..నోరా పతేహీ సహా మరికొంత మందిని సాక్షులుగా చేరుస్తూ ఆడీ పీఎంఎల్ ఏ చట్టం కింద చార్జ్ షీట్ దాఖలైంది. ఈ ఛార్జ్ షీట్ విషయంలో డిసెంబర్ 13 తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
200 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందుతుడిగా సుకేష్ చంద్ర శేఖర్...ఆయన భార్య లీనా సహా పలువురు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి వాళ్లంతా మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా కేసు జాక్వెలిన్..నోరా పతేహీ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల చుట్టూ తిరుగుతుంది. మరి ఇందులో వీళ్లంతా వాంగ్ములం ఇచ్చి సాక్షులుగా మారుతారా? కేసులో భాగస్వాములు అవుతారా? అన్నది నిగ్గు తేలాల్సి ఉంది.
ఇప్పటికే సుకేష్ చంద్రతో సంబంధం గురించి కీలక సమాచారం రాబట్టిన నేపథ్యం..ఆదివారం జాకీకి మళ్లీ దుబాయ్ వెళ్లడానికి ఆడీ అనుమతిలివ్వడం దబాంగ్ షోలో జాకీ ఎవరెవరితో కలిసిందన్న సమాచారాన్ని సైతం ఈడీ సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదుగంటలకు పైగానే ఆమెను విచారించనున్నారని ఈడీ వర్గాల సమాచారం. దీంతో జాకీ చుట్టు ఉచ్చు మరింత బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. శనివారం జాక్వెలిన్..నోరా పతేహీ సహా మరికొంత మందిని సాక్షులుగా చేరుస్తూ ఆడీ పీఎంఎల్ ఏ చట్టం కింద చార్జ్ షీట్ దాఖలైంది. ఈ ఛార్జ్ షీట్ విషయంలో డిసెంబర్ 13 తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
200 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందుతుడిగా సుకేష్ చంద్ర శేఖర్...ఆయన భార్య లీనా సహా పలువురు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి వాళ్లంతా మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా కేసు జాక్వెలిన్..నోరా పతేహీ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల చుట్టూ తిరుగుతుంది. మరి ఇందులో వీళ్లంతా వాంగ్ములం ఇచ్చి సాక్షులుగా మారుతారా? కేసులో భాగస్వాములు అవుతారా? అన్నది నిగ్గు తేలాల్సి ఉంది.