Begin typing your search above and press return to search.

'దృశ్యం-2' హిందీ రైట్స్ దక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్..!

By:  Tupaki Desk   |   4 May 2021 11:30 PM GMT
దృశ్యం-2 హిందీ రైట్స్ దక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్..!
X
మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ 'దృశ్యం-2' రీమేక్ హిందీ హక్కులను ఎవరు దక్కించుకుంటారా అని ఇంతకాలం అభిమానులు వెయిట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఎదురుచూసే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దృశ్యం సీక్వెల్ హక్కులను దక్కించుకున్నట్లు తాజాగా పనోరమా ఇంటర్నేషనల్ స్టూడియోస్ ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ పాతక్ అధికారికంగా ప్రకటించారు. దృశ్యం-2 సినిమా ఈ ఏడాది విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంది. అందులోను సీక్వెల్ కాబట్టి అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అయితే మొదటి దృశ్యం సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. కానీ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అదిరిపోయే కథాకథనాలతో ఈజీగా బీట్ చేశారు మేకర్స్.

'దృశ్యం-2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఈ సినిమా కథను అంతే నిబద్దతతో.. ప్యాషన్ తో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా నిర్మాతలుగా మేం ఆ విషయానికి కట్టుబడి ఉన్నామంటూ పనోరమా స్టూడియోస్ అధినేత కుమార్ మంగత్ తెలిపారు. దృశ్యం-2 ఈ ఏడాది నేరుగా థియేటర్స్ కాకుండా అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ రిలీజ్ అయింది. అలాగే అభిమానులు కూడా మొదటి మూవీలాగే ఈ సీక్వెల్ కు కూడా నీరజనాలు పలికారు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ సీక్వెల్ కు రంగం సిద్ధమైంది. ఈసారి సీక్వెల్లో కూడా మరి బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - శ్రీయశరన్ నటిస్తారేమో చూడాలి.

ఎందుకంటే ఇంకా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలు బయటపెట్టలేదు. అంతేగాక ఈ సీక్వెల్ దర్శకుడు ఎవరో కూడా ఇంకా నిర్మాతలు నిర్ణయించలేదు. మరి ఈ సీక్వెల్ కూడా ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ రూపొందిస్తాడేమో చూడాలి. అలాగే ఇటీవలే డైరెక్టర్ మాట్లాడుతూ.. పనోరమా ఫిలిమ్స్ వారు ఈ సూపర్ హిట్ కథను మళ్లీ తెరమీదకు తీసుకొచ్చి తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత దృశ్యం-2 రీమేక్ సిద్ధం కాబోతుంది. ఈ సినిమా కేబుల్ ఆపరేటర్ లైఫ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కింది. చూడాలి మరి!