Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌వి అమితంగా ఇష్ట‌ప‌డే హీరో ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   21 May 2022 11:30 AM GMT
సాయి ప‌ల్ల‌వి అమితంగా ఇష్ట‌ప‌డే హీరో ఎవ‌రో తెలుసా?
X
సాయి ప‌ల్ల‌వి.. ఈ న్యాచుర‌ల్ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తమిళనాడులో జ‌న్మించిన ఈ భామ 2015లో విడుద‌లైన `ప్రేమమ్` అనే మ‌ల‌యాళ మూవీతో సినీరంగ ప్ర‌వేశం చేసింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డమే కాదు.. సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఆ త‌ర్వాత మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందించిన `ఫిదా` మూవీతో సాయి ప‌ల్ల‌వి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇందులో `భానుమతి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్` అంటూ తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసిన ఈ భామ‌.. ఇక వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

వ‌రుస సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇటీవ‌ల ఈ బ్యూటీ లవ్ స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రాల‌తో మ‌రో రెండు హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న సాయి ప‌ల్ల‌వి.. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకున్న సాయి ప‌ల్ల‌వి.. తాను అమితంగా ఇష్ట‌ప‌డే హీరో ఎవ‌రో కూడా చెప్పేసింది.

మీ అభిమాన హీరో ఎవరు..? అని ప్ర‌శ్నించ‌గా అందుకు సాయి ప‌ల్ల‌వి ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోల పేర్ల‌ను చెప్పేసింది. ఆమె మ‌ట్లాడుతూ.. `కమల్ హాసన్, సూర్య, మమ్ముట్టి అంటే ఎంతో ఇష్టం. కమల్ హాసన్ గారు అంటే మరీ మ‌రీ ఇష్టం. ఎంతా అంటే ఆయ‌న నటించిన సినిమాల‌ కు సంబంధించిన పోస్టర్స్ కట్ చేసి మ‌రీ దాచుకున్నాను. ఇప్పటికీ ఆ పోస్టర్స్ నా దగ్గరే ఉన్నాయి` అంటూ చెప్పుకొచ్చింది.

క‌మ‌ల్ హాస‌న్ అంటే అమిత‌మైన ఇష్ట‌మ‌ని చెప్పిన సాయి ప‌ల్ల‌వి.. ఇప్పుడు ఆయ‌న నిర్మాణంలోనే న‌టించే అద్భుత అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. సోనీ పిక్చ‌ర్స్ తో క‌లిసి క‌మ‌ల్ హాస‌న్ ఈ మూవీని నిర్మించ‌బోతుండ‌గా.. ఇందులో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా ఖరారు అయింద‌ట‌.

ఇక సాయి ప‌ల్ల‌వి ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. త్వ‌ర‌లోనే రానా ద‌గ్గుబాటికి జోడీగా ఆమె న‌టించిన `విరాట ప‌ర్వం` చిత్రం విడుద‌ల కాబోతోంది. అలాగే ఇటీవ‌ల సాయి ప‌ల్ల‌వి `గార్గి` అనే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.