Begin typing your search above and press return to search.

ట్రోల్స్‌ పై బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ఫ్ర‌స్ట్రేష‌న్‌

By:  Tupaki Desk   |   27 May 2022 11:30 PM GMT
ట్రోల్స్‌ పై బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ఫ్ర‌స్ట్రేష‌న్‌
X
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ 'ఎఫ్ 3'. విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ తొలి షో నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. రోల‌ర్ కోస్ట‌ర్ ఫ‌న్ రైడ‌ర్ గా రూపొందిన ఈ మూవీ హాస్య ప్రియుల‌తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంద‌ని చెబుతున్నారు.

2019లో వ‌చ్చిన 'ఎఫ్ 2' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి ఫ్రాంచైజీగా తెర‌కెక్కిన 'ఎఫ్ 3' మే 27న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌స్ట్ డే మార్నింగ్ షో తో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. విక్ట‌రీ వెంక‌టేష్ అంతా అనుకున్ప‌న‌ట్టుగానే 'ఎఫ్ 3'లోనూ త‌న‌దైన స్టైల్లో అద‌ర‌గొట్టేశారు. రేచీక‌టి బాధితుడిగా త‌న‌దైన స్టైల్లో ఆక‌ట్టుకున్నారు. ఇక వ‌రుణ్ తేజ్ న‌త్తి వున్న యువ‌కుడిగా న‌టించి న‌వ్వులు పూయించాడు. త‌మ‌న్నా, మెహ్రీన్ గ్లామ‌ర్ డోస్ తో ఆక‌ట్టుకోగా సునీల్ - అలీ త‌మ‌దైన స్టైల్లో ఎంట‌ర్ టైన్ చేశారు.

ఇదిలా వుంటే అనిల్ రావిపూడి త‌న‌పై వ్య‌క్తిగ‌తంగా చేస్తున్న ట్రోలింగ్స్ పై స్పందించారు. త‌న సినిమాల‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ట్రోల్స్ పై ఘాటుగా స్పందించారు. ఎవ‌రికి కావాల్సిన సినిమా వాళ్లు చూస్తార‌ని. మిల‌ట‌రీ ఫుడ్ తినేవాడు బ్రాహ్మిణ్ హోట‌ల్ కి వెళ్లి 'ఏమ్రా వెజిటేరియ‌న్ పెడుతున్నావ్ థూ..నీయ‌మ్మా.. ఏం శాకాహారం.. ఏంతింటార్రా మీరు థూ.. అన్నంత మాత్రాన బ్రాహ్మిణ్ ఫుడ్ తినేవాళ్లు తిన‌కుండా వుండ‌రు' అంటూ ఫ్ర‌స్ట్రేట్ అయ్యాడు.

అంతే కాకుండా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కూడా వెల్ల‌డించాడు. 'జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి' లాంటి సోషియో ఫాంట‌సీ మూవీని చేయాల‌ని వుంద‌ని, అది త‌న డ్రీమ్ అని చెప్పుకొచ్చిన అనిల్ రావిపూడి 'మాయ‌బ‌జార్' లాంటి ఫ్యామిలీ సినిమాని తీసి మెప్పించాల‌ని వుంద‌న్న‌ది త‌న‌కున్న మ‌రో డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇండ‌స్ట్రీకి నాలుగు పిల్ల‌ర్స్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి,. బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ ల‌తో సినిమాలు చేయాల‌ని వుంద‌న్న అనిల్ ఇప్ప‌టికే వెంక‌టేష్ తో రెండు సినిమాలు చేశాన‌ని, త్వ‌ర‌లో బాల‌య్య‌తో సినిమా చేయ‌బోతున్నాన‌ని, త్వ‌ర‌లో చిరంజీవి, నాగార్జున‌ల‌తో సినిమాలు చేస్తే త‌న ఆశ‌యం పూర్త‌వుతుంద‌న్నాడు.

నంద‌మూరి బాల‌కృష్ణ తో అనిల్ రావిపూడి ఓ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈమూవీలో బాల‌కృష్ణ రెగ్యుల‌ర్ హీరో లా కాకుండా వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తిగా 20 ఏళ్ల కూతురికి తండ్రిగా క‌నిపించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అధికారికంగా వెల్ల‌డించ‌నున్నాడు.