Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో సినిమా ఓటీటీ రిలీజ్‌ కు రెడీ

By:  Tupaki Desk   |   7 July 2020 12:30 PM GMT
స్టార్‌ హీరో సినిమా ఓటీటీ రిలీజ్‌ కు రెడీ
X
థియేటర్లు ఓపెన్‌ కు ఇంకా చాలా సమయం పడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొన్నటి వరకు జులై ఆగస్టు వరకు థియేటర్లు పున: ప్రారంభం అవుతాయని సినీ వర్గాల వారు నమ్మకంతో ఎదురు చూశారు. కాని పెరుగుతున్న కేసుల కారణంగా ఈ ఏడాది చివరి వరకు కూడా థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి లేదనిపిస్తుంది. ఇప్పటి వరకు చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా ఇకపై పెద్ద సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. అందుకు సాక్ష్యంగా సౌత్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యింది.

ఓటీటీలో ధనుష్‌ హీరోగా నటించిన ‘జగమే తంత్రం’ అనే ద్వి భాష చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తమిళం.. తెలుగులో రూపొందిన ఈ చిత్రంను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొదట ధనుష్‌ ఓటీటీ రిలీజ్‌ కు ఒప్పుకోలేదు.

ఆర్థికపరమైన కారణాలు ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ధనుష్‌ ఒప్పుకున్నాడట. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ధనుష్‌ కెరీర్‌ లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌ గా ఐశ్వర్య లక్ష్మి నటించగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు.